Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరవింద సమేతలో హరికృష్ణ గురించి బాలయ్య ఉద్వేగం(Video)

Webdunia
సోమవారం, 22 అక్టోబరు 2018 (21:57 IST)
యంగ్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేష‌న్ అరవింద సమేత వీర రాఘ‌వ‌. ఈ సినిమా సాధించిన విజ‌యాన్ని పుర‌స్క‌రించుకుని చిత్ర యూనిట్ భారీ సక్సెస్ మీట్  హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసింది. ఈ వేడుక‌కు నంద‌మూరి న‌ట సింహం బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. బాలయ్య, తారక్, కళ్యాణ్ రామ్‌లను ఒకే వేదికపై చూసి అభిమానులు కేరింతలు కొట్ట‌డంతో శిల్ప క‌ళావేదిక అంతా మారు మ్రోగిపోయింది.
 
ఈ వేడుక‌లో బాలకృష్ణ మాట్లాడుతూ... ప్రజా శ్రేయస్సు కోసం ఏర్పడిన తెలుగు దేశం పార్టీ చైతన్య రథ సారథి నందమూరి హరికృష్ణ. ఆయన మరణం నా మనసును ఎంతో బాధ పెట్టింది. ఆయన ఎంతో ముక్కుసూటితనం కలిగిన వ్యక్తి. అనుకున్నది సాధించడానికి లాభ నష్టాల బేరీజు వేయకుండా ముందుకు వెళ్తారు. ఆయన మన మధ్య లేరంటే నమ్మశక్యం కావడం లేదు. 
 
టీడీపీ స్థాపించిన తొలి రోజుల్లో ఆయన నాన్నకు చేదోడువాదోడుగా ఉంటూ తండ్రికి తగిన తనయుడు అనిపించుకున్నారు. చైతన్య రథ సారథిగా ప్రజల్లోకి వెళ్లారు. నాన్నగారి మరణం తర్వాత హిందూపూర్‌లో అత్యధిక మెజారిటీతో రికార్డు సాధించిన ఘనత ఆయనదే. ఆయన రవాణా మంత్రిగా ఉన్నప్పుడు రైతులు వాడే ట్రాక్టర్లపై రోడ్ ట్యాక్స్ తొలగించారు. మహిళలకు కండక్టర్‌ ఉద్యోగాలు కల్పించి ఉపాధి చూపారు అంటూ భావోద్వేగంతో మాట్లాడారు. వీడియో...
 
 
జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. తారక్ చేసే సినిమాలు చేయడం ఎవరి కల్లా కాదు. నేను లెజెండ్ సినిమాలో ఆడ‌వాళ్ల గొప్ప‌త‌నం తెలియచేసేలా ఓ డైలాగ్ చెప్పాను. అలాగే గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాలో కూడా ఆడ‌వాళ్ల గొప్ప‌త‌నం గురించి ఉంటుంది. జూనీయ‌ర్ ఎన్టీఆర్ కూడా  ఆడ‌వాళ్ల గొప్ప‌త‌నం తెలియ‌చేసేలా ఈ సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments