Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒకే వేదికపై బాల‌య్య - ఎన్టీఆర్... సెట్ చేసింది ఎవ‌రో తెలుసా..?

ఒకే వేదికపై బాల‌య్య - ఎన్టీఆర్... సెట్ చేసింది ఎవ‌రో తెలుసా..?
, సోమవారం, 22 అక్టోబరు 2018 (18:32 IST)
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం అర‌వింద స‌మేత‌.. వీర రాఘ‌వ‌. ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేసిన‌ ఈ సినిమా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే మంచి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తోంది. ఈ శుభ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని చిత్ర యూనిట్ భారీ స‌క్స‌స్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ వేడుక‌కు నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ ముఖ్య అతిథిగా హాజ‌రై చిత్ర యూనిట్‌ను అభినందించారు. 
 
బాలయ్య‌, ఎన్టీఆర్.. ఈ బాబాయ్ - అబ్బాయ్‌లను ఒకే వేదిక మీద చూడ‌టం నంద‌మూరి అభిమానుల‌కు నిజ‌మైన పండ‌గ అని చెప్ప‌చ్చు. అస‌లు.. బాబాయ్ - అబ్బాయ్‌ల‌ను ఓకే వేదిక పైకి తీసుకువ‌చ్చింది ఎవ‌రో కాదు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్. అవును.. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ సినిమాలో హ‌రికృష్ణ పాత్ర పోషిస్తున్నారు. 
 
ఇటీవ‌ల బాల‌య్య‌, క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్లో కొన్ని సీన్స్ చిత్రీక‌రించిన విష‌యం తెలిసిందే. ఈ షూటింగ్ గ్యాప్‌లోనే క‌ళ్యాణ్ రామ్ బాబాయ్ బాల‌య్య‌తో అర‌వింద స‌మేత స‌క్స‌స్ మీట్‌కి రావాల‌ని అడిగాట‌. అంతే.. క‌ళ్యాణ్ రామ్ అడిగేస‌రికి బాల‌య్య నో చెప్ప‌కుండా వెంట‌నే ఎస్ అన్నాడట‌. అదీ.. బాల‌య్య‌, ఎన్టీఆర్ క‌ల‌యిక వెన‌కున్న అస‌లు క‌థ‌..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలకృష్ణ 'వేటగాడు' వేషం అదిరిపోయింది...