Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డ్రగ్స్ తీసుకునే తనూశ్రీ.. ఈరోజు పెద్దపెద్ద కబుర్లు చెబుతోంది : రాఖీసావంత్

డ్రగ్స్ తీసుకునే తనూశ్రీ.. ఈరోజు పెద్దపెద్ద కబుర్లు చెబుతోంది : రాఖీసావంత్
, సోమవారం, 22 అక్టోబరు 2018 (09:20 IST)
ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తాపై మరో బాలీవుడ్ సెక్సీ క్వీన్ రాఖీ సావంత్ సంచలన ఆరోపణలు చేసింది. డ్రగ్స్ తీసుకుని స్పృహ లేకుండా పడిపోయే తనూశ్రీ ఇపుడు పెద్దపెద్ద కబుర్లు చెబుతోందంటూ ఆరోపణలు గుప్పించింది. దీంతో రాఖీ సావంత్‌పై తనూశ్రీ దత్తా రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేసింది.
 
'మీటూ' ఉద్యమంలో భాగంగా నటుడు నానా పాటేకర్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తనూశ్రీ దత్తా ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఈ ఉదంతంలో పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు తనుశ్రీకి మద్దతు పలికారు. కానీ, నటి రాఖీ సావంత్ బాధితురాలు తనుశ్రీపై పలు ఆరోపణలు గుప్పించారు. 
 
అంతేకాకుండా, తనుశ్రీ డ్రగ్స్ తీసుకుని వ్యాన్‌లో ఉండగా, తాను నానా పాటేకర్ సలహా మేరకు ఒక సాంగ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కాంట్రావర్సీ క్వీన్ రాఖీపై తనుశ్రీ రూ.10 కోట్ల మేరకు పరువునష్టం దావా వేశారు. 
 
ఈ ఉదంతం గురించి రాఖీ గతంలో మీడియాతో మాట్లాడుతూ 'ఆరోజు తనుశ్రీ డ్రగ్స్ తీసుకుని వ్యాన్‌లో 4 గంటల పాటు స్పృహ లేకుండా పడివుంది. ఈ రోజు పెద్దపెద్ద కబుర్లు చెబుతున్న తనుశ్రీ అసలు బాగోతం బయపెట్టాలనుకుంటున్నాను. ఆ పాట నేను పూర్తి చేసినందుకు తనుశ్రీ నాకు నోటీసు కూడా పంపించింది. అయితే సినిమా యూనిట్ నన్ను కాపాడింది' అని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మాయిని బలవంతం చేసి లొంగదీసుకున్న దాఖలాలు లేవు : రాంగోపాల్ వర్మ