Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పు: అసెంబ్లీలో చర్చించేందుకు ఏపీ సర్కార్ సిద్ధం?

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (18:56 IST)
అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నాయకులు దీనిపై స్పందించారు. సీనియర్ నాయకుడు, వైసిపి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసారు. అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చ జరగాలంటూ ఆయన పేర్కొన్నారు.

 
చట్టాలను చేయడం అసెంబ్లీ హక్కు అనీ, దాన్ని తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించిన ధర్మాన దీనిపై ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. మరికొందరు నేతలు అమరావతి రాజధాని విషయంపై సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పారు.

 
ఐతే హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా తెలియజేసింది. ఒకసారి ప్రభుత్వం చట్టం చేసిన తర్వాత దాని పట్ల మిగిలివారు ఆ సమయంలో ఎలాంటి వ్యతిరేకత కనబరచనప్పుడు ఆ తర్వాత తిరిగి దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడాన్ని ఉటంకిస్తూ రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా రూలింగ్ ఇచ్చింది.

 
అంటే... అమరావతి రాజధాని ప్రకటించి రైతుల నుంచి భూ సమీకరణ జరిగిపోయిన తర్వాత అంతా అందుకు అంగీకరించాక తిరిగి దాన్ని రద్దు చేయడం లేదా ఆ ఒప్పందం నుంచి ఏ వ్యక్తి అయినా ప్రభుత్వం అయినా వైదొలగడం సాధ్యం కాదని రిట్ ఆఫ్ మాండమస్ తెలియజేస్తుంది. మరి దీనిపై అసెంబ్లీలో ఎలాంటి చర్చ చేస్తారన్నది వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments