Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాడెవ్వడు.. వీడెవ్వడు.. సజ్జల ఎవ్వడు అంటూ ఉద్యోగస్తులు చిందులు

వాడెవ్వడు.. వీడెవ్వడు.. సజ్జల ఎవ్వడు అంటూ ఉద్యోగస్తులు చిందులు
, గురువారం, 3 ఫిబ్రవరి 2022 (23:05 IST)
ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఇజ్జత్ మొత్తాన్ని గంగలో కలిపేశారు ఉద్యోగస్తులు. పీఆర్సీపై ముఖ్యమంత్రి కాకుండా సజ్జల ఇష్టానుసారం మాట్లాడటం పెద్ద దుమారానికి కారణమైంది. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలే కానీ మా జీతాల గురించి ఇవ్వడమేంటని ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.

 
ఈ నేపథ్యంలో ఛలో విజయవాడ పేరుతో వేలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడకు చేరుకున్నారు. పోలీసులు ఉదయం నుంచి హౌస్ అరెస్టులు చేసినా, నిర్భంధించినా వెనకడుగు వేయలేదు. 

 
ఉప్పెనలా ఉదయం 10 గంటల కల్లా విజయవాడకు చేరుకుని నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అయితే ఇందులో సజ్జల రామక్రిష్ణారెడ్డిని అభాసుపాలు చేసేలా ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. 

 
వాడెవ్వడు, వీడెవ్వడు.. సజ్జల ఎవ్వడు అంటూ ఉద్యోగస్తులు అష్టాచెమ్మా ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. సజ్జల తీరును దుయ్యబట్టారు. పిఆర్సీ అంశంలో సజ్జల జోక్యమేంటని ఆక్షేపించారు. అలాంటి ఇలాంటి ర్యాగింగ్ మొదలెట్ట లేదు ఉద్యోగులు, ఉపాధ్యాయులు. తమ సత్తాను చూపిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష