Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్ర‌భుత్వంతో ప్ర‌తిష్ఠంభ‌న వ‌ద్దు... అపోహ‌లుంటే మాట్టాడండి...

ప్ర‌భుత్వంతో ప్ర‌తిష్ఠంభ‌న వ‌ద్దు... అపోహ‌లుంటే మాట్టాడండి...
విజ‌య‌వాడ‌ , సోమవారం, 24 జనవరి 2022 (18:46 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌భుత్వానికి, ఎన్జీవోలకు మ‌ధ్య అగాధం మొద‌ల‌వుతోంది. పిఆర్సి జీవోలు వివాదాస్ప‌దంగా త‌యార‌వుతున్నాయి. పీఆ‍ర్సీ అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని గుర్తించబోమని ఉద్యోగ సంఘాలు చెప్పడం ప్రతిష్టంభన పెంచడమే అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణ రెడ్డి స్పష్టం చేశారు. అపోహలు ఉంటే కమిటీతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలన్నారు. సోమవారం పీఆర్సీపై మంత్రుల కమిటీ సమావేశం ముగిసిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు.
 
 
‘ఉద్యోగులు పరిస్థితిని అర్థం చేసుకోవాలి. రేపు కూడా చర్చలకు రమ్మని పిలుస్తాం. కమిటీని గుర్తించబోమని చెప్పడం ప్రతిష్టంభన పెంచడమే. ఉద్యోగుల అంశంపై కమిటీ మధ్యవర్తిత్వం వహిస్తుంది. మేము ఎప్పుడూ చర్చలకు సిద్ధంగానే ఉన్నాం. ఉద్యోగులను చర్చలకు పిలించాం. చర్చలకు ఉద్యోగ సంఘాలు రాలేదు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమే’ అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

SSY సూపర్ స్కీమ్: అమ్మాయికి 18 ఏళ్లు వచ్చాక..?