Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు షాక్.. బాబాయ్ వివేకా హత్య కేసు సీబీఐకు : హైకోర్టు

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (16:29 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి మరోమారు తేరుకోలోని దెబ్బతగిలింది. సొంతబాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. పైగా, హత్య జరిగి యేడాది గడిచినా కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని, అందువల్ల ఈ కేసు దర్యాప్తును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. 
 
మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గత 2019 మార్చి 15వ తేదీన హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ కేసును ఛేదించేందుకు మూడుసార్లు సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అయినా, ఈ కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో నిందితులను ఇంతవరకూ తేల్చలేదు. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత, అల్లుడు హైకోర్టులో గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. అదేసమయంలో సీఎం జగన్ కూడా సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో వివేకా కుటుంబీకులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపి తీర్పును వెలువరించింది. 
 
వైఎస్ వివేకానంద హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. సాధ్యమైనంత త్వరగా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐను ఆదేశించింది. ఈ హత్య జరిగి ఏడాదిన్నర కాలం గడుస్తున్నా దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తులో సమయం చాలా కీలకం కనుక ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. 
 
ఈ కేసుకు సంబంధించి సీఎం జగన్ పిటిషన్ ఉపసంహరణ ప్రభావం దర్యాప్తుపై ఉండకూడదని సూచించింది. పులివెందుల పోలీస్ స్టేషన్ నుంచే సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది. హైకోర్టు తాజా నిర్ణయం సీఎం జగన్‌కు గట్టిషాక్ వంటిందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బావ బాగానే సంపాదించారు.. కానీ, మమ్మల్ని కొందరు మోసం చేశారు... డిస్కోశాంతి

నేత చీర కట్టుకున్న స్రీ లా యూనివర్సిటీ పేపర్ లీకేజ్ చిత్రం: బ్రహ్మానందం

Sathya Raj: భారీ ఎత్తున డేట్ మార్పుతో రిలీజ్ కాబోతోన్న త్రిబాణధారి బార్బరిక్

హారర్, లవ్, కామెడీ ఎంటర్టైనర్ తో లవ్ యూ రా చిత్రం

మండాడి శరవేగంగా చిత్రీకరణ, విలన్ గా సుహాస్ స్పెషల్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments