Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ రోగి తొలి మరణం... కర్నాటకలో 76 యేళ్ల వృద్ధుడు...

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (16:07 IST)
కర్నాటక రాష్ట్రంలోనేకాకుండా దేశంలో తొలి కరోనా వైరస్ మృతి కేసు నమోదైంది. కర్నాటక రాష్ట్రంలో 76 యేళ్ల వృద్ధుడు కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతూ కన్నుమూశాడు. ఇది ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో నమోదైన తొలి కరోనా మృతి కేసు కావడం గమనార్హం. 
 
మృతుని పేరు మహ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ. వయస్సు 76 యేళ్లు. కలబుర్గి ప్రాంతానికి చెందిన హుస్సేన్.. కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతూ ఇటీవల ఆస్పత్రిలో చేరారు. ఆయన నుంచి రక్తం శాంపిల్స్ సేకరించి వైరాలజీ పరిశోధనాశాలకు పంపించారు. అయితే, ఆ రక్తపరీక్షల ఫలితాలు రాకముందే హుస్సేన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. 
 
ఈయన ఇటీవల సౌదీ అరేబియా నుంచి భారత్ వచ్చాడు. కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో అతడిని కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. అయితే, బ్లడ్ శాంపిల్స్ తాలూకు రిపోర్టులు బెంగళూరు ల్యాబ్ నుంచి రావాల్సి ఉంది. ఈలోపే సిద్ధిఖీ కన్నుమూయడంతో అతడి మరణానికి కారణం ఏంటన్నది తెలియరాలేదు. ఒకవేళ సిద్ధిఖీ కరోనా కారణంగా మరణిస్తే భారత్‌లో ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడిన తొలి వ్యక్తి అవుతాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెండితెరపై కనిపించనున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సొంత రాష్ట్రంలో రష్మికకు పెరిగిన నిరసనల సెగ!

సర్దార్ 2 కు కార్తి డబ్బింగ్ తో ప్రారంభమయింది

పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు చిరంజీవి విశ్వంభర కు క్లాష్ వస్తుందా ?

Pawan: నేను చచ్చాక ఆయనతో డైరెక్ట్‌ చేస్తా : రామ్‌గోపాల్‌వర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments