Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యే చింతమనేనిపై 'చండ్ర'నిప్పులు.. ఇష్టంలేకుంటే వెళ్లిపోవచ్చు

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉండటం ఇష్టంలేకుంటే నిర్ద్వంద్వంగా వెళ్లిపోవచ్చంటూ నిర్మొహమ

Webdunia
శనివారం, 28 ఏప్రియల్ 2018 (10:21 IST)
అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉండటం ఇష్టంలేకుంటే నిర్ద్వంద్వంగా వెళ్లిపోవచ్చంటూ నిర్మొహమాటంగా చెప్పారు. దీంతో చింతమనేని ఖంగుతిన్నారు.
 
గత కొన్ని రోజులుగా పార్టీ నేతలు కట్టుదాటి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న విషయం తెల్సిందే. అలాంటి వారిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు రోజుల్లో ఒక మంత్రిని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను కడిగేశారు. ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చని నిర్ద్వంద్వంగా తేల్చిచెప్పారు. 
 
గతంలో మాదిరిగా మృదువుగా నచ్చజెప్పే ధోరణికి స్వస్తిపలికి ఆయన కటువుగా వ్యవహరిస్తుండడంతో నేతలకు గొంతు మింగుడుపడడం లేదు. ఎన్నికలు ఏడాదిలో తొంగిచూస్తుండడం.. కొన్ని నియోజకవర్గాల నేతల్లో మార్పు కనిపించకపోవడం బాబు కఠిన వైఖరికి కారణం. 
 
ముఖ్యంగా, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ వ్యవహారం చంద్రబాబుకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఎందుకంటే.. గతంలో ఎమ్మార్వో వనజాక్షిపై కూడా ఆయన చేయి చేసుకున్న విషయం తెల్సిందే. తాజాగా బస్సుపై అంటించిన పోస్టర్లో చంద్రబాబు బొమ్మ చిరిగిందన్న కారణంతో ఆర్టీసీ సిబ్బందితో.. అడ్డువచ్చిన వారితో తగాదా పెట్టుకుని అందులో ఒకరిని కొట్టారన్న అభియోగం ఎదుర్కొంటున్న దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ను సీఎం చాలా గట్టిగా మందలించినట్లు సమాచారం.
 
గురువారం రాత్రి పొద్దుపోయాక ప్రభాకర్‌ ఇక్కడకు వచ్చి సీఎంను కలిశారు. 'బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రోడ్డుమీద ఈ తగాదాలు, గొడవలేంటి? నా చాకిరీ అంతా మీ చర్యలతో కొట్టుకుపోతోంది. నీ విషయంలో ఇప్పటికి రెండు మూడుసార్లు ఓపిక పట్టాను. అయినా మార్పు లేదు. ఇంకోసారి ఇలాంటి గొడవల్లో తలదూర్చితే ఎంత కఠిన నిర్ణయానికైనా వెనుకాడను. ఒక నియోజకవర్గం పోయినా ఫర్వాలేదు. పార్టీ ప్రతిష్ట నాకు ముఖ్యం' అంటూ చంద్రబాబు హెచ్చరించడంతో చింతమనేని ఖంగుతిన్నారు. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments