Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమలనాథులపై శివసేన ఆగ్రహం... విర్రవీగితే.. వాత పెడతారు!

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (10:59 IST)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దరిమిలా బీజేపీపై మిత్రపక్షం శివసేన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. అధికారంలో ఉన్న నాయకులు అహంకారంతో వ్యవహరించినందుకు ప్రజలు కీలెరిగి వాత పెట్టారంటూ వ్యాఖ్యానించింది. ఎన్నికల ముందు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో చేపట్టిన మహా జనదేశ్ యాత్ర ప్రభావమేదీ లేదని తేల్చింది. ఈ ఎన్నికల్లో కూటమికి 200కు పైగా స్థానాలు వస్తాయన్న ఫడ్నవీస్ అంచనాలు తలకిందులయ్యాయని పేర్కొంది. 
 
ఈ మేరకు శివసేన అధికారిక పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో బీజేపీపై విమర్శలు గుప్పించింది. విపక్షాల్లో చీలికలతో ఎన్నికల్లో గెలువలేరని స్పష్టమైందని పేర్కొంది. ఎన్నికల ముందు శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీని బీజేపీ తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని తెలిపింది.

అయితే, 50 సీట్లకు పైగా గెలుచుకుని ఎన్సీపీ తమ బలం పెరిగిందని నిరూపించుకుందని, సరైన నాయకత్వంలేని కాంగ్రెస్ సైతం 44 స్థానాలు గెలుచుకుని తన సత్తా చూపిందన్నది. పార్టీల ఫిరాయింపులు, విపక్షాల్లో చీలికలతో ఎన్నికల్లో విజయం సాధించవచ్చని బీజేపీ భావించింది.  

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments