ముస్లిం పర్సనల్ లా బోర్డు యుటర్న్ : అయోధ్య అంతిమతీర్పుపై రివ్యూ

Webdunia
ఆదివారం, 17 నవంబరు 2019 (17:04 IST)
వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇటీవల అంతిమ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ముస్లీం పర్సనల్ లా బోర్డు యు టర్న్ తీసుకుంది. అయోధ్య అంతిమ తీర్పుపై మరింత స్పష్టత ఇవ్వాలని కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఆదివారం లక్నో వేదికగా ముస్లి పర్సనల్ లా బోర్డు సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య భూవివాదం తీర్పుపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 
 
అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులదేనని సుప్రీం కోర్టు కొన్నిరోజుల క్రితం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ విషయం చర్చించేందుకు సమావేశమైన ముస్లిం పర్సనల్ లా బోర్డు రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం తమ హక్కు అని తీర్మానించింది.
 
ఈ అంశంపై జమాయిత్ ఉలేమా ఈ హింద్ అధ్యక్షుడు అర్షద్ మదాని మాట్లాడుతూ, అయోధ్యలో ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించలేదని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టం చేసిందని, అయినప్పటికీ తమకు అక్కడ మసీదును ఇంతవరకు కేటాయించలేదన్నారు. 
 
అందుకే, వాస్తవంగా అక్కడ తమకు రావాల్సింది ఏమిటి అనేదానిపై స్పష్టత కోరుతూ సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలనుకుంటున్నామని వెల్లడించారు. అటు, యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments