Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపమని రక్షిస్తే చేతిని కొరికేసింది.. మద్యంమత్తులో యువతి హల్‌చల్

Webdunia
ఆదివారం, 17 నవంబరు 2019 (15:50 IST)
మద్యంమత్తులో ఓ యువతి హల్‌చల్ సృష్టించింది. పీకల వరకు మద్యం రోడ్డుపై అపస్మారకస్థితిలో పడివున్న యువతిని పోలీసులు పాపంభీతికెళ్లి స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ మద్యం మత్తులో ఓ ఎస్సై, ముగ్గురు లేడీ కానిస్టేబుళ్ళపై దాడికి దిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జహీరానగర్‌లో సదరు యువతి అపస్మారక స్థితిలో పడి ఉంది. స్థానికుల సమాచారంతో ఆమెను బంజారాహిల్స్ పీఎస్‌కు తీసుకొచ్చారు. 
 
కొద్దిసేపటికి కళ్లు తెరిచిన ఆమె.. పోలీసులను అభ్యంతరకర రీతిలో తిట్టడం ప్రారంభించింది. ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మహిళా ఎస్సైపై దాడి చేసింది. మరో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లను కొట్టింది. ఓ కానిస్టేబుల్ చేతిని కొరికి, మెడపై రక్కి నానా రభస చేసింది. 
 
అక్కడి నుంచి పరిగెత్తి పారిపోతుండగా.. ఎలాగోలా ఆమెను పోలీసులు అడ్డకున్నారు. దర్యాప్తులో ఆమెను నాగాలాండ్‌కు చెందిన లీసాగా గుర్తించారు. మాదాపూర్‌లో పని చేస్తుందని తెలిసింది. ఆమెను సంబంధీకులకు అప్పగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆమె మద్యం సేవించిందా.. డ్రగ్స్ తీసుకుందా తేలాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments