Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌ను కలిసిన సినీ నటుడు అలీ, ఆ పదవి ఖాయమైందా?

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (17:26 IST)
టాలీవుడ్ కమెడియన్ అలీ ఇవాళ సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అలీ ఓ మొక్కను సీఎం జగన్‌కు బహుకరించినట్టు తెలుస్తోంది. అలీ గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు.
 
జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్‌కు ఎంతో సన్నిహితుడని గుర్తింపు ఉన్న అలీ.. జనసేన పార్టీలో చేరుతాడని బాగా ప్రచారం జరిగింగి. కానీ అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. అప్పట్లో ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తాడనీ ఊహాగానాలు వచ్చాయి.
 
గుంటూరు నుంచి అసెంబ్లీ బరిలో దిగాలని ఆయన భావించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల్లో టికెట్ లభించని నేపథ్యంలో అలీకి ఫిలిం డెవలెప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని కూడా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా అలీ సీఎం జగన్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments