Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిపక్షమే మీడియా నోరు నొక్కేస్తోంది: రామకృష్ణా రెడ్డి

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (17:21 IST)
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి విపక్ష నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. మీడియాలో కథనాలు ప్రసారం చేయకుండా కోర్టుకు వెళుతున్నారని, ప్రతిపక్షమే మీడియా స్వేచ్చను హరించడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో అధికార పక్షం మీడియా స్వేచ్చను కాలరాసిందని విన్నామని, కానీ ఇప్పుడు ప్రతిపక్షమే మీడియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
 
అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పైన విచారణలో తొందరపాటు ఏమీ లేదని, తప్పులపై విచారణ జరపకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఏదైనా చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు అని అంటారని అసహనం వ్యక్తం చేశారు. అమరావతి భూములపై విచారణకు నియమించిన సిట్ స్వతంత్ర విచారణ సంస్థ అని సజ్జల స్పష్టం చేశారు.
 
టీడీపీ కార్యకర్తగా పనిచేసిన వ్యక్తికి అడ్వకేట్ జనరల్‌గా పదవి ఇచ్చారని అతనిపై ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని వాటి ఆధారంగానే కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు.ఇలాంటి పరిణామాలపై మీడియాలో కథనాలు రావొద్దంటూ న్యాయస్థానాలకు వెళుతున్నారని వ్యాఖ్యానించారు. మీడియా నోరు నొక్కేయడం కొంచెం అతిగా అనిపిస్తోందని సజ్జల అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments