Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిపక్షమే మీడియా నోరు నొక్కేస్తోంది: రామకృష్ణా రెడ్డి

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (17:21 IST)
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి విపక్ష నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. మీడియాలో కథనాలు ప్రసారం చేయకుండా కోర్టుకు వెళుతున్నారని, ప్రతిపక్షమే మీడియా స్వేచ్చను హరించడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో అధికార పక్షం మీడియా స్వేచ్చను కాలరాసిందని విన్నామని, కానీ ఇప్పుడు ప్రతిపక్షమే మీడియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
 
అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పైన విచారణలో తొందరపాటు ఏమీ లేదని, తప్పులపై విచారణ జరపకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఏదైనా చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు అని అంటారని అసహనం వ్యక్తం చేశారు. అమరావతి భూములపై విచారణకు నియమించిన సిట్ స్వతంత్ర విచారణ సంస్థ అని సజ్జల స్పష్టం చేశారు.
 
టీడీపీ కార్యకర్తగా పనిచేసిన వ్యక్తికి అడ్వకేట్ జనరల్‌గా పదవి ఇచ్చారని అతనిపై ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని వాటి ఆధారంగానే కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు.ఇలాంటి పరిణామాలపై మీడియాలో కథనాలు రావొద్దంటూ న్యాయస్థానాలకు వెళుతున్నారని వ్యాఖ్యానించారు. మీడియా నోరు నొక్కేయడం కొంచెం అతిగా అనిపిస్తోందని సజ్జల అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments