యజమాని మృతి.. 3నెలలైనా ఆస్పత్రి నుంచి కదలని శునకం.. చివరికి?

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (09:57 IST)
Dog
యజమాని మృతి చెందినా... మూడు నెలలుగా పెంపుడు శునకం నిరీక్షిస్తున్న ఘటన తమిళనాడు ఆస్పత్రిలో చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ఆస్పత్రిలో చేరిన యజమాని పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. కానీ ఆ శునకం మాత్రం ఆయన అక్కడే వున్నారని భావించి ఆస్పత్రి నుంచి కదల్లేదు. 
 
యజమాని కోసం మూడు నెలలైనా.. ఆయన ఇకలేరనే విషయం గ్రహించకుండా యజమాని కోసం నిరీక్షిస్తోంది. ఈ ఘటన చూపరులను కంట తడి పెట్టిస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు సేలంకు చెందిన మోహన్ కుమార్ ప్రభుత్వాసుపత్రిలో చేరారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన మోహన్.. పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. 
 
అయితే యజమాని లోపలే వున్నారని భావించిన మృతుడి పెంపుడు శునకం మూడు నెలలుగా ఆయన రాక కోసం ఎదురుచూస్తోంది. ఆస్పత్రి సిబ్బంది అక్కడ నుంచి పంపేసినా.. మళ్లీ అదే స్థలానికి చేరుకుంటోంది. దీంతో ఆస్పత్రి సిబ్బందే ఆ శునకానికి ఆహారం అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments