Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆశ" ఎన్‌కౌంటర్ ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (11:04 IST)
టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిన చిత్రం ఆశ. దేశ వ్యాప్తంగా సంతలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసును ఆధారంగా చేసుకుని దిశ ఎన్‌కౌంటర్ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించారు. 
 
అయితే, దిశ అత్యాచారం, హత్య కేసును సినిమా తీయనున్నట్లు ఆర్జీవీ ప్రకటన చేయగానే విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన హంతకుల కుటుంబాలతో కలిసి పలు విషయాలను చర్చించారు. కరోనా సమయంలోనే సినిమా షూటింగ్ సైతం పూర్తి చేశాడు. 
 
గతంలోనే పోస్టర్‌ను విడుదల చేసిన రాంగోపాల్ వర్మ కొన్నిరోజులు ఈ సినిమా వివాదంలో చిక్కుకున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు సినిమా టైటిల్‌ను చేంజ్ చేసి మరో పోస్టర్‌ను విడుదల చేశాడు. అందులో నవంబర్ 26న సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. 
 
అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 'ఆశ ఎన్‌కౌంటర్' అనే టైటిల్‌తో విడుదలైన ఈ ట్రైలర్‌లో వాస్తవంగా జరిగిన సంఘటనలనే చూపించాడు. ట్రైలర్ ఆరంభంలో ఈ కథ ఎవరినీ ఉద్దేశించినది కాదు అంటూనే ప్రజలు టీవీలో చూసిన, తెలిసిన సన్నివేశాలను ట్రైలర్‌లో చూపించారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

leopard: తల్లిదండ్రులతో నిద్రస్తున్న మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే?

Chandra Babu: నారావారిపల్లెకు స్కోచ్ అవార్డు లభించింది: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

వివాహేతర సంబంధం.. 35 ఏళ్ల వ్యక్తిని భార్య, ప్రియుడు, సహచరుడు గొంతుకోసి చంపేశారు..

ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధించిన కోర్టు

Nellore: భారీ వర్ష హెచ్చరికలు.. నెల్లూరు ప్రజలకు అలెర్ట్ - చేపల వేటకు వెళ్ళొద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments