మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని : ఆర్కే రోజా

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (11:02 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు సోమవారం వైకాపా శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ బర్త్‌డేను పురస్కరించుకుని వివిధ రకాలైన సమాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఓ మంచి పని చేశారు. 
 
'మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని..! మన అందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడం జరిగింది. పి.పుష్పకుమారి అనే ఈ చిన్నారి పూర్తి చదువుకు నేను దత్తత తీసుకోవడం జరిగింది' అంటూ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలియజేశారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టారు.
 
కాగా రోజా దత్తత తీసుకున్న బాలిక... చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ప్రస్తుతం ఆమె తిరుపతిలోని బాలికల హోంలో ఉంటూ మెడిసిన్ చదవాలన్న తన కలను సాకారం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న పుష్పకుమారి అనే బాలికను రోజా దత్తత తీసుకున్నారు. 
 
ఆమె చదువుకు అయ్యే ఖర్చుతో పాటు భవిష్యత్తులో అన్ని రకాలుగా సాయం చేస్తానని రోజా అన్నారు. లక్షలాది మంది చిన్నారులకు మేనమామగా ఉంటూ వారి విద్యకు సహకరిస్తున్న జగనన్నకు తానిచ్చే పుట్టిన రోజు బహుమతి ఇదే అంటూ రోజా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముంబై తరహా పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర : టార్గెట్ లిస్టులో ఇండియా గేట్

నవంబర్ 15కి వాయిదా పడిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం.. కీలక నిర్ణయాలకు కాంగ్రెస్ సిద్ధం

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం : ధర్మారెడ్డికి కష్టాలు తప్పవా?

తను చనిపోయినట్లు టీవీలో వస్తున్న వార్తను చూస్తున్న నటుడు ధర్మేంద్ర, ఇంతకన్నా దారుణం ఏముంటుంది?

డాక్టర్ షాహీన్ సిద్ధిఖీ: అద్భుతమైన బోధకురాలు ఉగ్రవాదిగా ఎలా మారిపోయింది?!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments