Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జాను'ని బయటైతే చూస్తున్నారు కానీ థియేటర్లలో చూడలేకపోతున్నారా? ఎందుకని?

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (20:13 IST)
సమంత-శర్వానంద్ నటించిన జాను చిత్రం ఓహో... ఆహో అంటూ రివ్యూలు రాసినా జనం థియేటర్లకు పెద్దగా రావడం లేదు. దీనితో బాక్సాఫీస్ వద్ద ఇది కుప్పకూలింది. ఐతే జాను ప్రి-రిలీజ్, థ్యాంక్స్ మీట్ ఏది ఏర్పాటు చేసినా అక్కడికి మాత్రం కుప్పలుతెప్పలుగా అభిమానులు వస్తున్నారు. కానీ జాను చిత్రానికి ఆ రద్దీ వుండటంలేదు.
 
అసలు జాను చిత్రం ఎందుకలా అయ్యింది. తమిళంలో త్రిష-విజయ్ సేతు నటించిన 96 చిత్రానికి ఇది రీమేక్. ఈ 96 చిత్రాన్ని తమిళం అర్థం కాకపోయినా చాలామంది తెలుగువారు చూసేశారు. కాబట్టి స్టోరీ లైన్ ఏమిటో తెలిసిపోయింది. మళ్లీ ప్రత్యేకంగా చూడాలి అనుకుంటే ఏదో సమంత యాక్టింగ్ కోసమో, శర్వానంద్ యాక్టింగ్ కోసమో రావాలి. అలా వస్తున్నవారు కొద్దిమంది వుంటున్నారు. అందువల్ల థియేటర్ల వద్ద అనుకున్న రద్దీ కనబడటంలేదు. 
 
ఇకపోతే జాను విడుదలై వారంతంలో రూ. 6.5 కోట్లు రాబట్టింది. ఐతే ఈ చిత్రాన్ని రూ. 21 కోట్లకు పంపిణీ చేసినట్లు టాలీవుడ్ న్యూస్. అదే నిజమైతే మరో 15 కోట్లకు పైగానే రాబట్టాలి. జానుకి అంత సీనుందా అనేదే ఇప్పుడు టాక్. మరోవైపు దిల్ రాజు కూడా తను నెంబర్లు గురించి ఆలోచన చేయలేదని చెప్పేశారు. కాబట్టి జాను బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాగా మిగిలిపోతుందా లేదంటే అంచనాలను తలకిందులు చేసి భారీ వసూళ్లను రాబడుతుందా... వెయిట్ అండ్ సీ.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments