తెలుగు మాట్లాడ‌గానే గొప్ప‌గా చూస్తున్నారుః రుషికా రాజ్

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (16:34 IST)
Rushika Raj
తెలుగు సినిమాల్లో ముఖ్యంగా చిన్న సినిమాల్లో ఎక్కువ‌గా క‌న్న‌డ న‌టీమ‌ణులే రాజ్య‌మేలుతున్నారు. టీవీల్లో స‌రేస‌రి. వారిదే రాజ్యం. క‌న్న‌డ‌న‌టి అయిన రుషికా రాజ్ తెలుగు నేర్చుకుని మాట్లాడుతుంటే అంద‌రూ గొప్ప‌గా చెబుతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని చాలా ఆనందంగా చెబుతోంది. సాచీ క్రియేష‌న్స్ ప‌తాకం పై స్నేహా రాకేశ్ నిర్మాత‌గా, నూత‌న ద‌ర్శకుడు శేష్ కార్తీకేయ తెర‌కెక్కిస్తున్న చిత్రం అశ్మీ. పూర్తిగా వైవిధ్య‌మైన కాన్సెప్ట్ తో థ్లిల‌ర్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రుషికా రాజ్, రాజా నరేంద్ర‌, కేశ‌వ్ దీపిక లీడ్ రోల్స్ చేస్తున్నారు.
 
- నేను ఒక కన్నడ అమ్మాయిని. నేను కన్నడ లో మూడు   సినిమాలు చేశాను, తగరు అనే మూవీ నాకు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ మూవీ పేరు అశ్మీ అంటేనే సంస్కృత పదం, నేను హీరోయిన్ గా చేయటానికి చాలా సంవత్సరాలు ఆగాను ఒక మంచి రోల్ చేయటానికి, అందరిలాగా చేయకూడదు చేస్తే సొసైటీ కి మంచి మెసేజీ వుండే క్యారెక్టర్ చేయాలి అనుకున్నాను, ప్రతి ఒక్క అమ్మాయి ఈ సినిమా నుంచి మెసేజ్ ఇవ్వాలి అని ఈ సినిమా చేశాను, ఈ సినిమా నేను మొదట ఒప్పుకునే అప్పుడు చాలా భయపడ్డాను ఈ సినిమా ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చాలా భయం వేసింది, ఈ సినిమా లో మహిళలు ఈ రోజుల్లో చాలా మంది పేస్ చేస్తున్న సమస్యలు ని ఈ సినిమా  లో చూపించటం జరిగింది, ఈ పాయింట్ నేను సినిమా చేయటానికి దోహద పడ్డది, 
 
- ఈ సినిమా లో యాక్టింగ్ కి చాలా స్కోప్ వున్న పాత్ర ఇది,నేను తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నాను అని అందరు చెప్తున్నారు న‌న్ను గొప్ప‌గా చూడ్డం జ‌రుగుతుంది. నేను తెలుగు నేర్చుకోవాటినికి రెండు సంవత్సరాలు పట్టింది, ఫస్ట్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అయిన డైరెక్టర్ గారు అయినా సినిమా ని ఓటిటి కోసం అని తీసి సినిమా బాగా వచ్చింది అని ఈ సినిమా ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు, 
 
- ఇది ప్రస్తుతం సమాజం లో ప్రతి మహిళా పేస్ చేస్తున్న క్యారక్టర్ ప్రతి మహిళా కి మెసేజీ రీచ్ అవ్వాలి అనేదే మా ఈ ప్రయత్నం అంటూ చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments