Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

ఉగ్రదాడిలో కాశ్మీర్ బీజేపీ నేత, భార్య మృతి.. ఖండించిన గవర్నర్

Advertiesment
BJP leader
, సోమవారం, 9 ఆగస్టు 2021 (19:07 IST)
ఉగ్రదాడిలో కాశ్మీర్ బీజేపీ నేత, ఆయన భార్య మృతి చెందారు. సోమవారం అనంతనాగ్‌ పట్టణంలోని లాల్ చౌక్‌ వద్ద ఓ బీజేపీ సర్పంచ్​, ఆయన భార్యపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రగాయాలైన వారిని హాస్పిటల్‌కి తరలించగా.. అక్కడ వారు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
 
మృతులు కుల్గాం జిల్లా భాజపా కిసాన్​ మోర్చా అధ్యక్షుడు గులామ్ రసూల్​ దార్​, ఆయన భార్య అని ఓ పోలీస్​ అధికారి చెప్పారు. కుల్గామ్ జిల్లా​ రేద్వానీకి చెందిన గులామ్ రసూల్​ దార్​.. ఆ గ్రామ సర్పంచ్​గా పని చేస్తున్నారు. 
 
ప్రస్తుతం ఆయన అనంత్​నాగ్​లోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సర్పంచ్​ రసూల్ దార్​, ఆయన భార్యపై ఉగ్రవాదుల దాడి ఘటనను జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​ ఖండించారు. ఈ పిరికిపంద చర్యకు పాల్పడినవారికి త్వరలోనే తగిన రీతిలో బుద్ధి చెబుతామని అన్నారు. మృతుల కుటుంబానికి లెఫ్టినెంట్​ గవర్నర్​ సంతాపం తెలిపారు
 
మరోవైపు, పూంచ్ సెక్టార్‌లో బీఎస్ఎఫ్ దళాలు నిర్వహించిన తనిఖీల్లో భారీ స్థాయిలో ఆయుధాలు లభ్యమయ్యాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. బీఎస్ఎఫ్ దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. విల్ సంగద్ అటవీ ప్రాంతంలో జరిగిన గాలింపులో దొరికిన ఆయుధాల్లో ఏకే 47 రైఫిళ్లు, పిస్తోళ్లు ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ష‌ర్మిల భ‌ర్త అనిల్ కుమార్‌‌ను కలిశానా? వంద శాతం ఫేక్ న్యూస్: రాజయ్య