Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య కాపురానికి రాలేదని పురుగుల మందుతాగి భర్త...

భార్య కాపురానికి రాలేదని పురుగుల మందుతాగి భర్త...
, శుక్రవారం, 6 ఆగస్టు 2021 (08:19 IST)
కట్టుకున్న భార్య కాపురానికి రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ భర్త... పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నగేపూర్‌లో జరిగింది. 
 
తాజా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నవీపేట మండలంలోని నాగేపూర్‌ గ్రామానికి చెందిన బోయిడి సతీశ్‌(32)కు ఫకిరాబాద్‌కు చెందిన పోసాని అనే మహిళతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏళ్లు గడుస్తున్నా సంతానం లేదు దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 
 
ఈ క్రమంలో మూడు నెలల క్రితం పోసాని పుట్టింటికి వెళ్లి పోయింది. ఈ క్రమంలోనే భార్య కాపురానికి రావాలని కుల పెద్దల సమక్షంలో పలుమార్లు కోరారు. అయినప్పటికీ భార్య ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
దీంతో మనస్తాపం చెందిన సతీశ్‌ ఈ నెల 4న పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందాడు. మృతుడి తండ్రి నడిపి గంగారాం ఫిర్యాదు మేరకు శవాన్ని పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్సై తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

viral Video: లెహంగా ధరించి పుషప్స్ చేస్తున్న యువతి