Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల కోసమే పవన్ ఆ పని చేసారు: పరుచూరి గోపాలకృష్ణ

ఐవీఆర్
బుధవారం, 29 జనవరి 2025 (15:55 IST)
ఏ పని చేసినా కేవలం ప్రజల కోసమే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్నారని సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఇదివరకు సీనియర్ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారనే ఆత్రుతగా చూసేవాళ్లమని అన్నారు. అప్పట్లో మీడియా ఇలా ఎలక్ట్రానిక్ రూపంలో అందుబాటులో లేకపోవడంతో మరుసటి రోజు పత్రికలు చూసి తెలుసుకోవాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడలా కాదు.. అక్కడ ఏం చేస్తున్నారో ఇక్కడ మనం చూసేస్తున్నాం. పవన్ కల్యాణ్ ప్రజల కోసం ఏం చేస్తున్నారనేది తెలుసుకునేందుకు నేనే కాదు ఎంతోమంది ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకూ నేను చూసింది మాత్రం... పవన్ కల్యాణ్ గారు ఏది చేసినా అది ప్రజల కోసం మాత్రమే చేస్తున్నారు.
 
ఎన్నికల్లో కూడా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం అటు భాజపా, ఇటు తెదేపా పార్టీల మధ్య సయోధ్య కుదిర్చి కూటమిగా ఏర్పడి విజయం సాధించారన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదనీ, రాజకీయ ప్రయోజనాలన్నిటినీ పవన్ కల్యాణ్ పక్కన పెట్టేసి కేవలం ప్రజల ప్రయోజనాల కోసమే పెద్దపీట వేశారంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments