Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానటి అద్భుతంగా ఉంది : కేటీఆర్ ట్వీట్

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "మహానటి". ఈ చిత్రం బుధవారం (మే 9వ తేదీ) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన అనేక మంది సెలెబ్రిటీలు తమ అభిప్రాయాన్ని

Webdunia
గురువారం, 10 మే 2018 (08:57 IST)
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "మహానటి". ఈ చిత్రం బుధవారం (మే 9వ తేదీ) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన అనేక మంది సెలెబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
 
ఈ కోవలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా చేరిపోయారు. ఆయన ఈ చిత్రాన్ని చూసిన తర్వాత తన స్పందనను ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. 'మ‌హాన‌టి' చిత్రం చాలా అద్భుతంగా ఉంద‌న్నారు. నిజంగా ఈ చిత్రం ఎంత‌గానో అల‌రించింది. సావిత్రి పాత్ర‌కి కీర్తి సురేష్ జీవం పోసింది. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత స్వప్నలకు తన అభినందనలు అంటూ పేర్కొన్నారు.
 
సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాగచైతన్యల నటన అద్భుతంగా ఉందని కేటీఆర్ త‌న ట్వీట్ ద్వారా కొనియాడారు. మ‌హాన‌టి చిత్రంపై ఇప్ప‌టికే రాజ‌మౌళి, రాఘ‌వేంద్ర‌రావు, అట్లీ, సుశాంత్‌, మోహ‌న్ బాబుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. కాగా, ఈ చిత్రంలో సావిత్రి పాత్ర‌ని కీర్తి సురేష్ పోషించ‌గా, జెమినీ గ‌ణేష‌న్‌గా దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments