Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి 'వాల్తేరు వీరయ్య' స్ట్రీమింగ్

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (11:46 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రం 27వ తేదీ నుంచి నెట్‌ఫ్లిట్‌ ఫిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చిరు సినిమాను థియేటర్‌లో చూడటం కుదరదని అభిమానులు ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ చిత్రం విడుదలైన విషయం తెల్సిందే. 
 
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై నిర్మించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. ప్రకాష్ రాజ్, బాబీ సింహా, కేథరిన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రలను పోషించారు. అలాగే, "అన్నయ్య" చిత్రం తర్వాత చిరంజీవి, రవితేజ కలిసి నటించారు.
 
సంక్రాంతికి బరిలో నిలిచిన నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డితో పోటీపడిన వాల్తేరు వీరయ్య ఓవరాల్‌గా రూ.250 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. ఓవర్సీ‌స్‌లోనూ వాల్తేరు వీరయ్య సినిమా 2.5 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఓవర్సీస్ వసూళ్లలో కొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సోమవారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments