Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.వంద కోట్ల క్లబ్‌లో చేరిన చిరంజీవి "వాల్తేరు వీరయ్య"

waltair veerayya
, సోమవారం, 16 జనవరి 2023 (13:57 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. శృతిహాసన్ నటించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ నెల 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు రోజుల్లో ఏకంగా రూ.108 కోట్లను కొల్లగొట్టింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ చిత్రంతో చిరంజీవితో రవితేజ తోడుకావడంతో పాటు రెండో భాగంలో ఎమోషన్ చేరింది. దీంతో ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకర్షించింది. పైగా, ఈ చిత్రం మొదలైన తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అదనపు బలం చేకూర్చింది. 
 
ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతిహాసన్ నటించగా, బాలీవుడ్ నటి ఊశ్వరి రౌతలా ఐటమ్ సాంగ్‌లో నటించారు. ప్రకాశ్ రాజ్ .. బాబీ సింహా ప్రతినాయకులుగా కనిపించారు. ప్రస్తుతం వసూళ్ల పరంగా అదే జోరును కొనసాగిస్తున్న ఈ సినిమా, లాంగ్ రన్ లో ఎంతవరకూ రాబడుతుందనేది చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌తో ఛాన్స్ వచ్చినా హీరోయిన్‌గా చేయను.. అలానే ఉండిపోతా.. : ప్రియాంక జవాల్కర్