విశాల్‌తో మూడోసారి జతకట్టనున్న తమన్నా..

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (11:18 IST)
తమన్నా మళ్లీ విశాల్‌తో మరోసారి కలిసి స్క్రీన్‌ని షేర్ చేసుకునేందుకు సిద్ధమవుతోంది. విశాల్‌ హీరోగా దర్శకుడు సుందర్‌ సి. ఓ సినిమాను రూపొందించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. విశాల్‌ మార్క్‌ మాస్‌ యాక్షన్‌, కామెడీ అంశాల మేళవింపుగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్‌ వర్క్‌ జరుగుతోంది. డిసెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో విశాల్‌ సరసన కథానాయికగా తమన్నాని ఫైనల్‌ చేసినట్టు సమాచారం. 
 
గతంలో విశాల్‌, తమన్నా కలిసి ''కత్తి సండై'' చిత్రంలో నటించారు. ఇది మంచి విజయం సాధించింది. వీరికిది రెండో సినిమా. సుందర్‌ సి. దర్శకత్వంలో విశాల్‌ గతంలో ''మదగజరాజా'', ''ఆంబల'' చిత్రాల్లో నటించారు. వీరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రమిది. 
 
కాగా.. తమన్నా చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి', 'ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌', 'ఎన్టీఆర్‌: కథానాయకుడు', 'దేవి 2', 'దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి', 'కన్నె కలైమానె' చిత్రాల్లో నటిస్తుంది. 'ఎన్టీఆర్‌ - కథానాయకుడు'లో జయప్రద పాత్రలో మెరవనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments