Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇట్స్ అఫీషియల్.. బిచ్చగాడు 2 పోస్టర్ విడుదల

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (11:59 IST)
Bichagadu 2
డబ్బింగ్ చిత్రమే అయినా టాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ రానుంది. ఈ సినిమా తెలుగులో రూ. 20 కోట్ల షేర్ సాధించి ఔరా అనిపించింది. మరోవైపు టీవీల్లో ప్రసారమైనపు కూడా ఈ సినిమాకు మంచి టీర్పీలే వచ్చాయి. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంతో హీరోగా విజయ్ ఆంటోని క్రేజ్ అమాంతం పెరిగింది. 
 
గత కొన్ని రోజులుగా బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ రాబోతుందని విజయ్ ఆంటోని పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించాడు. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా విజయ్ ఆంటోని.. బిచ్చగాడు సినిమా సీక్వెల్‌కు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేశాడు. అంతేకాదు దానికి సంబంధించిన తెలుగు, తమిళ పోస్టర్స్2ను కూడా రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. 
 
కేవలం రూ. కోటితో రూపాయలతో తెలుగులో విడుదలైన ఈ డబ్బింగ్ చిత్రం ఎవరి అంచనాలకు అందకుండా.. రూ. 20కోట్ల షేర్ సాధించి ఔరా అనిపించింది. మరోవైపు టీవీల్లో ప్రసారమైనపు కూడా ఈ సినిమాకు మంచి టీర్పీలే వచ్చాయి. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంతో హీరోగా విజయ్ ఆంటోని క్రేజ్ అమాంతం పెరిగింది. 

ప్రియ కృష్ణ స్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న బిచ్చగాడు 2 చిత్రం తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి 2021లో విడుదల చేయనున్నట్టు పోస్టర్‌లో ప్రకటించారు. ఈ సీక్వెల్‌లో తెలుగులో ఫేమసైనా కొంత మంది నటీనటులు నటించే అవకాశం ఉందట. అప్పట్లో బిచ్చగాడు చిత్రాన్ని విజయ్ ఆంటోని నిర్మించగా.. శశి డైరెక్ట్ చేసాడు. ఈ సీక్వెల్‌ను మాత్రం విజయ్ ఆంటోని నిర్మిస్తూ.. దర్శకత్వ బాధ్యతలు ప్రియ కృష్ణ స్వామికి అప్పగించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments