Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్న పొడుగుకాళ్ళ సుందరి

మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్న పొడుగుకాళ్ళ సుందరి
, గురువారం, 1 ఆగస్టు 2019 (15:17 IST)
బాలీవుడ్ అందాల హీరోయిన్లలో ఒకరు శిల్పాశెట్టి. అచ్చం చెక్కిన శిల్పాన్ని తలపించే అందం. ఈమె సుధీర్ఘకాలం తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈమె కేవలం బాలీవుడ్‌లోనేకాకుండా దక్షిణాది భాషల్లోనూ తన నటనతో మంచి అభిమానగణాన్ని సంతరించుకుంది. ఆ తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. 
 
కానీ, ఒకవైపు తన వైవాహిక జీవితంలో బీజీగా గడుపుతూనే, మరోవైపు యోగా వీడియోలు, ఫిట్నెస్ వీడియోలు, ఐపీఎల్ క్రికెట్‌తో నిత్యం అభిమానులకు దగ్గరగా ఉంటూ వస్తోంది. ఈ క్రమంలో గత 2007లో "ఆప్నే" అనే చిత్రంలో శిల్పాశెట్టి నటించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించినప్పటికీ.. చిన్నచిన్నపాత్రలకే పరిమితమైంది. 
 
ఈ పరిస్థితుల్లో దశాబ్దకాలానికి పైగా వెండితెరకు దూరంగా ఉన్న ఈ మంగళూరు భామ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని శిల్పాశెట్టి స్వయంగా చెప్పింది. త్వరలోనే షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో వస్తున్న "నికమ్మా" అనే చిత్రంలో నటించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మడు పోస్టు పెట్టింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్‌బాస్ హౌస్‌కు రకుల్ ప్రీత్ సింగ్... ఎందుకంటే...