Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లో విషాదం - "త్రీ ఇడియట్స్" నటుడు కన్నుమూత

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (12:46 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతూ వచ్చిన "త్రీ ఇడియట్" చిత్ర  నటుడు అరుణ్ బాలీ ఇకలేరు. ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. 79 యేళ్ల వయసులో ముంబైలోని తన నివాసంలో గురువారం కన్నుమూశారు. 
 
గత కొంతకాలంగా నాడీ కండరాల వ్యాధి మస్తీనియా గ్రావిస్‌తో ఆయన బాధపడుతూ వచ్చారు. దీనికి చికిత్స కోసం ముంబైలోని హిర్షందాన్ని ఆస్పత్రిలో కూడా చేరారు. కానీ, ఆయన గురువారం చనిపోయారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు. వీరు శుక్రవారం ముంబైకు చేరుకోనున్నారు. వారు వచ్చిన తర్వాత ఈ అంత్యక్రియలు పూర్తిచేయనున్నారు. 
 
ఇదిలావుంటే అరుణ్ బాలీ అనేక చిత్రాల్లో నటించారు. త్రీ ఇడియట్స్, కేదార్‌నాథ్, పాలిపట్, హే రామ్, దండ్ నాయక్, రెడీ, జమీన్, పోలీస్ వాలా, గుండా, రామ్ జానే వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాగే, పలు టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. అరుణ్ బాలీ నిర్మాతగా కూడా పలు చిత్రాల్లో నిర్మించి, ఒక నిర్మాతగా జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments