Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్' ప్రొడక్షన్ నెం.2 మూవీ లాంఛ్

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (16:05 IST)
అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజులు, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కొత్త సినిమా గురువారం ఉదయం ముహూర్తమ్ షాట్‌తో మొదలైంది. 'వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్' సంస్థ ప్రొడక్షన్ నెంబర్ 2గా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఓ బ్యూటిఫుల్ ప్రేమకథగా ఈ సినిమాను దర్శకుడు ఏ సుశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. అర్జున్ దాస్యన్ నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. చిత్ర కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలకు చిత్ర బృందం హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ, వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్ 2 మూవీని గురువారం ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభించాం. ఇదొక అందమైన ప్రేమ కథ. నేటి నుంచి తొలి షెడ్యూల్ చిత్రీకరణ మొదలుపెడుతున్నాం. జనవరిలో రెండో షెడ్యూల్, ఫిబ్రవరిలో మూడో షెడ్యూల్ పూర్తి చేయాలనుకుంటున్నాం. మార్చిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. 
 
హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ, మంచి లవ్ స్టోరీ ఎప్పుడు చేస్తారని నన్ను అడుగుతుంటారు. చాలా రోజుల తర్వాత క్లీన్ లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నాను. తుంగభద్ర సినిమాలో సంగీత దర్శకుడు హరిగౌర, సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ గారితో పనిచేశాను. ఈ సినిమాతో మరోసారి వారితో కలిసి పనిచేస్తున్నాను. ఇవాళ్టి నుంచే షూటింగ్ ప్రారంభిస్తున్నాం. త్వరలోనే మీ ముందుకొస్తాం అన్నారు.
 
హీరో అర్జున్ సోమయాజులు మాట్లాడుతూ, వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ సంస్థలో నాకు హీరోగా అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎ సుశాంత్ రెడ్డి, నిర్మాత అర్జున్ దాస్యన్‌కు రుణపడివుంటాను. అరుణ్, మేఘాతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. 
 
దర్శకుడు ఎ సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు, మేఘా ఆకాష్ మెయిన్ లీడ్‌గా లవ్ స్టోరీ సినిమా ప్రారంభించాం. ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. ఫిబ్రవరి సెకండ్ వీక్ కల్లా సినిమా చిత్రీకరణ పూర్తి చేయబోతున్నట్టు చెప్పారు. 
 
ఈ చిత్రానికి సంగీతం - హరి గౌర, సినిమాటోగ్రాఫర్ - ఐ ఆండ్రూ, ఎడిటర్ - ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ - పీఎస్ వర్మ. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments