Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

దేవీ
గురువారం, 14 ఆగస్టు 2025 (18:34 IST)
Mallidi Vashita, Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చిత్రం రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా సమయం వుంది. కానీ సినిమా ఆలస్యం అవుతూనే వుంది. తాజా ఈ సినిమాపై ఆసక్తికర అంశాన్ని దర్శకుడు వెల్లడించారు. చిరంజీవిగారితో కథ చెప్పినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. రాజమౌళి తోసహా గతంలోనూ పలువురు యమలోకం చూపారు. ఇంద్రలోకం, నాగ లోకం కూడా  చూపించారు. కానీ పురాణాల్లో 14 లోకాలున్నాయని విన్నాం. అందులో సత్య లోకం వుంది.
 
కనుక దాన్ని ఇప్పటివరకు ఎవరూ చూపించని లోకాన్ని చూపిస్తున్నాం. హాలీవుడ్ సినిమాల్లో తెల్లటి గుర్రాలు ఎగిరే సన్నివేశాలు చాలా చూశాం. అక్కడి మనుషులు కూడా పెద్ద పెద్ద చెవులతో వుంటారు. అవతార్ లో అవిచూసేవాం. వారంతా మన పురాణాల్లోంచి తీసుకున్న అంశాలే అని నేను గట్టిగా చెప్పగలను అని అన్నారు.
 
అందుకే, చిరంజీవితో సత్యలోకం చూపిస్తున్నా. ఎందుకు అక్కడికి వెళ్ళాడు? అనేది ఆసక్తికరం పాయింట్. ఈ సినిమాలో ప్రతీ విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకుని చేశాం. ఆగస్టు 22న మా సినిమా గురించి కూడా కొత్త అప్ డేట్ రాబోతుంది అని చెప్పారు. సోసియో-ఫాంటసీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. త్రిషా కృష్ణన్‌, ఆషికా రంగనాథ్, కునాల్‌ కపూర్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ - చంద్రబాబు - పవన్ హర్షం

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments