9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

ఠాగూర్
గురువారం, 4 సెప్టెంబరు 2025 (22:43 IST)
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సతీమణి, అపోలో ఆస్పత్రుల వైస్ చైర్మన్ ఉపాసన కొణిదెల తొమ్మిది వారాల పాటు సాయిబాబా వ్రతాన్ని భక్తి, శ్రద్ధలతో పూర్తి చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఇన్‌స్టా వేదికగా స్పెషల్‌ పోస్ట్‌ పంచుకున్నారు. గురు పూర్ణిమ నాడు మొదలు పెట్టిన సాయిబాబా వ్రతాన్ని సెప్టెంబరు నాలుగో తేదీతో ముగించారు. వ్రతం పూర్తయిన సందర్భంగా షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకోనున్నారు.
 
'గురుపూర్ణిమ రోజు ప్రారంభమైన సాయిబాబా వ్రతం 9 వారాల ప్రయాణం శాంతి, నమ్మకంతో నడిచింది. నా సోదరితో కలిసి మొదలు పెట్టిన ఈ వ్రతంతో నేను అభిలషించిన దాని కన్నా ఎక్కువగా బాబా ఆశీస్సులు లభించాయి. నన్ను సదా రక్షిస్తున్న ఆ సాయిబాబాకు ధన్యవాదాలు. నా జీవిత కాలంలో వీలైనంత ఎక్కువమందికి సేవ చేస్తానని బాబాను ప్రార్థించాను. అత్తమ్మ కిచెన్‌ వినియోగదారులకు మీల్స్‌ అందిస్తాం.. జై సాయిరామ్‌' 
 
చిన్నప్పటి నుంచే తనకు దైవం మీద ఎంతో భక్తి అని ఓ సందర్భంలో ఉపాసన చెప్పారు. సాయిబాబా వ్రతం చేయడం మొదలు పెట్టగానే సానుకూల ఆలోచనలు, పరిస్థితులు అలవడ్డాయని చెప్పారు. అత్యంత భక్తితో, నిష్టతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఫలితం దక్కుతుందని ఉపాసన సహా సాయి భక్తుల విశ్వాసం. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, విజయం లభిస్తాయని, ఐశ్వర్యం, కుటుంబ శాంతి, విద్య, ఉద్యోగం, వివాహం ఇలా సకల మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెట్రో రైల్లో మహిళ వెనుక నిలబడి ప్యాంట్ జిప్ తీసిన కామాంధుడు

Pharma Student: ప్రేమను నిరాకరించిందని ఫార్మసీ విద్యార్థిని కత్తితో పొడిచి చంపేశాడు

భర్తకు నత్తి అని పుట్టింటికి వెళ్లింది.. అక్కడ ప్రియుడితో జంప్ అయ్యింది.. రెండేళ్ల బిడ్డను?

ద్యావుడా... టేకాఫ్ అవుతుంటే విమానం చక్రం ఊడిపోయింది (video)

హెచ్‌పీ పెట్రోల్ బంకులో నీళ్లు కలిపి పెట్రోల్.. అర లీటరు నీళ్లు- అర లీటర్ పెట్రోల్ (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments