Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ బారినపడిన మరో ఇద్దరు సింగర్స్... ఎవరువారు?

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (16:25 IST)
ఇప్పటికే గానగంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ బారినపడి ప్రాణాపాయస్థితిలో స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రెండు రోజులతో పోల్చుకుంటే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్టు ఆయన సోదరి, గాయని ఎస్.పి.శైలజ చెప్పారు. అయినప్పటికీ ఎస్.పి.బి ప్రత్యేక ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మరో ఇద్దరు గాయనీమణులు ఈ వైరస్ బారినపడ్డారు. వారు ఎవరో కాదు.. సునీత, మాళవిక. 
 
వీరిద్దరూ ప్రముఖ టీవీ చానెల్‌లో ప్రసారమయ్యే సంగీత కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ వైరస్ బారినపడినట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల వీరికి క‌రోనా పాజిటివ్ అని నిర్థార‌ణ అయింది. ఆ కార్య‌క్ర‌మంలోనే క‌రోనా సోకింద‌ని మా వ‌ర్గాల స‌మాచారం. ఎందుకంటే ప్రోగ్రామ్‌లో పాల్గొన్న‌ చాలామందికి క‌రోనా వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. 
 
కాగా, తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అనేకమంది సెలెబ్రిటీలు ఈ వైరస్ బారినపడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్, ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య, నాగవంశీలతో పాటు.. దర్శకుడు తేజ, మరికొందరు సినీ ప్రముఖులు ఈ వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జోగి రమేశ్ సతీమణి ధరించిన నెక్లెస్ ధర రూ.23 కోట్లా??

మద్యం మత్తు: అవతల రోడ్డుపై వెళ్తున్న బైకును ఢీకొన్న టిప్పర్ లారీ (వీడియో)

Thunderstorms: జూన్ 2 నుండి 4 వరకు ఏపీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

కర్నాటకలో దారుణం.. బేకరీలో వ్యక్తిని నరికి చంపిన దుండగులు

Kavamma: అమ్మవారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తూ గుండెపోటుతో కుప్పకూలి భక్తుడు మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments