Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ దర్శకుడు శరత్ ఇకలేరు.. కేన్సర్‌తో మృతి...

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (14:30 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ దర్శకుడు శరత్ కన్నుమూశారు. పలువురు అగ్ర హీరోలతో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఆయన గురువారం ఉదయం కన్నుమూశారు. 74 యేళ్ల శరత్ గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ వచ్చాడు. దీంతో ఆయనను హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. కుటుంబ కథా నేపథ్యంతో పాటు బలమైన హీరోయిజం ఉన్న చిత్రాలను తెరకెక్కించడంతో ఆయన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
 
గత 1986లో వచ్చిన 'చాదస్తపు మొగుడు' ద్వారా ఆయన చిత్ర దర్శకుడుగా అరంగేట్రం చేశారు. ఇందులో సుమన్, భానుప్రియ జంటగా నటించారు. ఆ తర్వాత 'పెద్దింటల్లుడు' చిత్రం ఆయన కెరీర్‌లో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. 
 
ఈ సక్సెస్‌తో వెనుదిరగని ఆయన... ఆ తర్వాత 25కిపైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. హీరో సుమన్‌తో అత్యధికంగా ఎనిమిది చిత్రాలను రూపొందించారు. వీటిలో "బావ బావమరిది, చిన్నల్లుడు" వంటి చిత్రాలు ఉన్నాయి. అలాగే, బాలకృష్ణతో "వంశోద్ధారకుడు, పెద్దన్నయ్య, వంశానికొక్కడు, సుల్తాన్" వంటి చిత్రాలను తెరకెక్కించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments