Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ నటుడు కాంతారావు సతీమణి కన్నుమూత..

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (14:06 IST)
hymavathi
ప్రమఖ సినీ నటుడు కాంతారావు సతీమణి హైమావతి(87) శుక్రవారం తుది శ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నాం 12 గంటల సమయంలో మల్లాపూర్‌లోని వారి నివాసంలో ఆమె గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమె కన్నుమూశారు. కాంతారావు 2009 మార్చి 22న మరణించారు. హైమావతి మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 
 
కాంతారావు, హైమావతి దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ రోజు ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కాంతారావు 1940లో సుశీల అనే మహిళను వివాహాం చేసుకున్నారు. అయితే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవడంతో హైమావతిని రెండో వివాహం చేసుకున్నారు. 
 
వీరి పెళ్లి జరిగిన కొన్ని రోజులకు సుశీల మరణించారు. కాంతారావు సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని గుడిబండ గ్రామంలో జన్మించారు. అనేక సాంఘీక, జానపద చిత్రాల ద్వారా తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేశారు. ఆయన 400లకు పైగా చిత్రాల్లో నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments