Webdunia - Bharat's app for daily news and videos

Install App

తింటున్నంతసేపు ఇస్తరాకు.. తిన్నాక ఎంగిలి ఆకు...

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (16:15 IST)
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ చేసే ట్వీట్ వెనుక నిగూఢార్థం దాగివుంటుంది. అందుకే ఆయన చేసే ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియానే కాదు... టాలీవుడ్‌లో కూడా చర్చనీయాంశంగా మారింది. తింటున్నంత సేవు ఇస్తరాకు.. తిన్న తర్వాత ఎంగిలి ఆకు అంటారంటూ ఓ ట్వీట్ చేశారు. ఇలా ట్వీట్ చేయడానికి అసలు కారణ లేకపోలేదు. 
 
బండ్ల గణేష్ నిర్మాతగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రం విడుదలై ఇటీవల ఎనిమిదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ఓ ట్వీట్ చేశారు. అందులో నిర్మాత బండ్ల గణేష్ పేరును మరచిపోయారు. ఆ తర్వాత చేసిన తప్పును తెలుసుకుని మరో ట్వీట్ చేశారు. అందులో నిర్మాత బండ్ల గణేష్‌ను ఆకాశానికెత్తేశారు. దీంతో ఈ వివాదం ముగిసిపోయిందని ప్రతిఒక్కరూ భావించారు. 
 
కానీ, బండ్ల గణేష్ బాగా హర్ట్ అయినట్టున్నారు. అందుకే ఈ అంశాన్ని మనసులో పెట్టుకునే ఆయన తాజా ట్వీట్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాకరేపుతున్న బండ్ల గణేష్ ట్వీట్‌ను పరిశీలిస్తే, 'తింటున్నంత సేపు ఇస్తరాకు అంటారు. తిన్నాక ఎంగిలి ఆకు అంటారు. నీతో అవసరం ఉన్నంత వరకు వరసలు కలిపి మాట్లాడతారు. అవసరం తీరాక... లేని మాటలు అంటకడతారు' అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ డైరెక్టర్ హరీష్ శంకర్‌ను ఉద్దేశించే చేశారని చెప్పుకుంటున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahanadu: కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది: చంద్రబాబు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments