Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పిన కొరటాల శివ.. ఎందుకు?

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (14:14 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ఈయన తీసిన ప్రతి చిత్రం సూపర్ హిట్టే. పైగా సందేశాత్మకంగా సమాజానికి ఓ మంచి మెసేజ్‌ను ఇచ్చేలా ఉంటాయి. అలాంటి కొరటాల శివ ఇపుడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తాను సోషల్‌ మీడియా నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి అందరికి షాక్‌ ఇచ్చాడు. 
 
ఈ మేరకు ఆయన ‘నా వ్యక్తిగత విషయాలను, నేను తీసే సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా మీతో పంచుకున్నాను. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నా. ఇకపై మీడియా మిత్రుల ద్వారా ప్రతి అప్‌డేట్‌ అందిస్తూ ప్రేక్షకులకు చేరువలోనే ఉంటాను. మీడియా చానళ్లు, పత్రికల ద్వారా మనం కలుస్తూనే ఉంటాం. దీనివల్ల మీడియం మారిందే తప్ప మన మధ్య బంధంలో మార్పు ఉండదు’ అంటూ కొరటాల ట్వీట్‌ చేశాడు.
 
కాగా ప్రస్తుతం కొరటాల మెగాస్టార్‌ చిరంజీవితో "ఆచార్య" మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని అనంతరం జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేసేందుకు సన్నాహలు చేస్తున్నాడు. ఆ తర్వాత మహేష్ బాబు లేదా రామ్ చరణ్‌తో మరో సినిమా ఉండొచ్చన్నది ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

YouTuber : పాకిస్థాన్‌తో సంబంధాలు.. పంజాబ్ యూట్యూబర్ అరెస్ట్.. ఏం చేశాడంటే?

వైసిపి వెన్నుపోటు దినం: ఏంటి పళ్లు కొరుకుతున్నావ్, అంబటిపై పోలీస్ అధికారి కన్నెర్ర (video)

Monsoon session: జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments