Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పిన కొరటాల శివ.. ఎందుకు?

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (14:14 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ఈయన తీసిన ప్రతి చిత్రం సూపర్ హిట్టే. పైగా సందేశాత్మకంగా సమాజానికి ఓ మంచి మెసేజ్‌ను ఇచ్చేలా ఉంటాయి. అలాంటి కొరటాల శివ ఇపుడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తాను సోషల్‌ మీడియా నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి అందరికి షాక్‌ ఇచ్చాడు. 
 
ఈ మేరకు ఆయన ‘నా వ్యక్తిగత విషయాలను, నేను తీసే సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా మీతో పంచుకున్నాను. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నా. ఇకపై మీడియా మిత్రుల ద్వారా ప్రతి అప్‌డేట్‌ అందిస్తూ ప్రేక్షకులకు చేరువలోనే ఉంటాను. మీడియా చానళ్లు, పత్రికల ద్వారా మనం కలుస్తూనే ఉంటాం. దీనివల్ల మీడియం మారిందే తప్ప మన మధ్య బంధంలో మార్పు ఉండదు’ అంటూ కొరటాల ట్వీట్‌ చేశాడు.
 
కాగా ప్రస్తుతం కొరటాల మెగాస్టార్‌ చిరంజీవితో "ఆచార్య" మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని అనంతరం జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేసేందుకు సన్నాహలు చేస్తున్నాడు. ఆ తర్వాత మహేష్ బాబు లేదా రామ్ చరణ్‌తో మరో సినిమా ఉండొచ్చన్నది ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments