Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిల్మ్ చాంబర్‌కు సిరివెన్నెల పార్థివదేహం : ప్రముఖుల నివాళులు

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (09:59 IST)
అకాల మరణం చెందిన ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని కిమ్స్ ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ చాంబర్‌కు బుధవారం ఉదయం తరలించారు. అక్కడ సిరివెన్నెలకు అనేక సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళిలు అక్కడకు చేరుకుని నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా సిరివెన్నెల కుటుంబ సభ్యులను ఓదార్చారు. 
 
ముఖ్యంగా, సినీ నటుడు తనికెళ్ల భరిణి కన్నీటి పర్యంతమయ్యారు. స్రవంతి మూవీస్‌లో తామిద్దరం కలిసి పనిచేశాని గుర్తు చేసుకున్నారు. ప్రతి పదాన్ని చెక్కేవాడాని, ఆయన పాట వజ్రం పొదిగినట్టు ఉండేదని, ఆయన పాటల ప్రకాశం తెలుగు జాతి ఉన్నంతవరకు నిలిచివుంటుందన్నారు. 
 
అలాగే, ప్రతి నాయకుడు రావు రమేష్ మాట్లాడుతూ, ఆ సరస్వతీ పుత్రుడు గురించి మాట్లాడే అర్హత, అనుభవం తనకు లేదన్నారు. చాలా గొప్పగా తండ్రి పేరును నిలబెడతావన్న ఆయన మాటలు తనలో స్ఫూర్తిని నింపాయన్నారు. 
 
అదేవిధంగా హీరో వెంకటేష్, సంగీత దర్శకుడు మణిశర్మ, దర్శకుడు గుణశేఖర్, సింగర్ సునీత, పరుచూరి గోపాలకృష్ణ, స్రవంతి రవికిషోర్, అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, సాయికుమార్, హీరో బాలకృష్ణ, అల్లు అర్జున్ తదితరులు ఆయనకు నివాళులు అర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments