Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబరు 13న "నిప్పు - నీరు కలిసి వస్తున్నాయ్"... ఆర్ఆర్ఆర్ లేటెస్ట్ అప్‌డేట్

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (14:08 IST)
ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). డి.వి.వి.దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్ర‌స్తుతం క్లైమాక్స్ షూటింగ్ జ‌రుగుతుంది. అత్యంత పరాక్రమశాలి భీం, ఉగ్రరూపుడైన రామరాజు తమ ఉమ్మడి లక్ష్య సాధనకు సంసిద్ధులవుతున్నట్టుగా ఇటీవ‌ల చిత్ర యూనిట్ ప్రకటించింది. 
 
స్వాతంత్య్ర సమరయోధులు కొమరంభీం, అల్లూరి సీతారామరాజు చారిత్రక ఇతివృత్తానికి కాల్పనిక అంశాల్ని మేళవించి రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మేక‌ర్స్ తాజాగా స‌ర్‌ప్రైజ్ అప్‌డేట్ ఇచ్చారు. సోమవారం మ‌ధ్యాహ్నం మూవీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. అక్టోబరు 13వ తేదీన ప్రేక్షకుల ఈ చిత్రం విడుదల కానుంది.
 
నిప్పు - నీరు కలిసి ఓ శక్తిగా మీ మందుకు వస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త అనుభూతిని పొందుతారని పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రంలో అలియాభట్‌, ఒలివియోమోరిస్‌ కథానాయికలుగా న‌టిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

Devi Ahilyabai Holkar: ఇండోర్‌లో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments