Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబరు 13న "నిప్పు - నీరు కలిసి వస్తున్నాయ్"... ఆర్ఆర్ఆర్ లేటెస్ట్ అప్‌డేట్

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (14:08 IST)
ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). డి.వి.వి.దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్ర‌స్తుతం క్లైమాక్స్ షూటింగ్ జ‌రుగుతుంది. అత్యంత పరాక్రమశాలి భీం, ఉగ్రరూపుడైన రామరాజు తమ ఉమ్మడి లక్ష్య సాధనకు సంసిద్ధులవుతున్నట్టుగా ఇటీవ‌ల చిత్ర యూనిట్ ప్రకటించింది. 
 
స్వాతంత్య్ర సమరయోధులు కొమరంభీం, అల్లూరి సీతారామరాజు చారిత్రక ఇతివృత్తానికి కాల్పనిక అంశాల్ని మేళవించి రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మేక‌ర్స్ తాజాగా స‌ర్‌ప్రైజ్ అప్‌డేట్ ఇచ్చారు. సోమవారం మ‌ధ్యాహ్నం మూవీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. అక్టోబరు 13వ తేదీన ప్రేక్షకుల ఈ చిత్రం విడుదల కానుంది.
 
నిప్పు - నీరు కలిసి ఓ శక్తిగా మీ మందుకు వస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త అనుభూతిని పొందుతారని పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రంలో అలియాభట్‌, ఒలివియోమోరిస్‌ కథానాయికలుగా న‌టిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments