'బాస్ బస్టర్' హిట్‌కు ధన్యవాదాలు నాన్నా : తండ్రికి తనయుడి అభినందన

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (17:49 IST)
రామ్ చరణ్ నిర్మాతగా నిర్మించిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా, అమితాబ్, జగపతి బాబు, కిచ్చా సుధీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నాలు కలిసి నటించారు. ఈ చిత్రం అక్టోబరు రెండో తేదీన ఐదు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచి బ్లాక్ బస్టర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం యూనిట్ ఆనందోత్సవాల్లో మునిగిపోయింది. 
 
ముఖ్యంగా, సినిమా రంగంలో పునఃప్రవేశం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ముఖంలో విజయోత్సాహం తొణికిసలాడుతోంది. సైరాకు విశేష స్పందన లభిస్తుండడంతో ఆయన హ్యాపీ మూడ్‌లో కనిపిస్తున్నారు. ఎంతో మనసుపడిన కథ, మనసుపెట్టి తీసిన దర్శకుడు, ఖర్చుకు వెనుకాడని నిర్మాత, నూటికి నూరుశాతం ప్రదర్శన ఇచ్చిన నటీనటులు, అద్భుత నైపుణ్యం కనబర్చిన సాంకేతిక నిపుణులు సైరా చిత్రాన్ని బ్లాక్ బస్టర్‌గా మలిచారన్నది ఇప్పటివరకు వచ్చిన రివ్యూల సారాంశం. 
 
ఈ నేపథ్యంలో, చిరంజీవి, రాం చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి తదితర యూనిట్ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అందరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చి తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా అత్యద్భుతంగా ఉందంటూ చిరంజీవి అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ ద్వారా రామ్ చరణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 'ఈ బాస్ బస్టర్‌కు ధన్యవాదాలు నాన్నా' అని తన తండ్రికి థ్యాంక్స్ చెప్పాడు. తన తండ్రి తనను ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆయన మా డాడీయే కావొచ్చు.. కానీ ఈ యాత్రలో ఆయన ఫోటోను వాడను : కవిత

త్వరలో వందే భారత్ 4.0 : రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

తమిళనాడులోనూ ఎన్డీఏ కూటమి రాబోతోందా? సీఎం అభ్యర్థిగా టీవీకే చీఫ్ విజయ్?

కామారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం

AI Hub: విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభంపై ప్రధాని హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments