Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పాలెగాడు ఉయ్యాలవాడ'కు ప్రాణప్రతిష్ట చేశారు : ఎస్.ఎస్. రాజమౌళి

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (17:22 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావించి నటించిన 152వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి" అక్టోబరు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదలైంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలకాగా, ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. 
 
ఈ చిత్రం టాక్‌పై దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి స్పందిస్తూ, సైరా నరసింహారెడ్డి పాత్రకు చిరంజీవి ప్రాణప్రతిష్ట చేశారని కితాబిచ్చారు. చరిత్ర మర్చిపోయిన వీరుడి కథకు మళ్లీ జీవం పోశారు. అమితాబ్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా ప్రతి ఒక్కరూ కథలో ఇమిడిపోయే పాత్రలతో సినిమాకు వన్నె తెచ్చారని రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. 
 
నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిలకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నానని, సైరా నరసింహారెడ్డి ఘనవిజయానికి వారిద్దరూ అర్హులేనని రాజమౌళి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments