సివిల్ సర్వీస్ పరీక్ష -2017.. అగ్రస్థానంలో తెలంగాణ ఐఆర్ఎస్ ఆఫీసర్ అనుదీప్.. జేడీ కుమారుడు?

సివిల్ సర్వీస్ పరీక్ష -2017 ఫలితాల్లో తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన అనుదీప్ దూరిశెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. 2017, అక్టోబర్‌-నవంబర్‌ మధ్య నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలు శుక్రవారం సాయ

Webdunia
శనివారం, 28 ఏప్రియల్ 2018 (11:08 IST)
సివిల్ సర్వీస్ పరీక్ష -2017 ఫలితాల్లో తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన అనుదీప్ దూరిశెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. 2017, అక్టోబర్‌-నవంబర్‌ మధ్య నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో అనుదీప్ అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటుకున్నాడు. 
 
రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ మధ్య మౌఖిక పరీక్షలు నిర్వహించి మొత్తం 990 మంది పేర్లను ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌తో పాటు గ్రూప్‌-ఎ, గ్రూప్‌-బి ఉద్యోగాలకు యూపీఎస్సీ ఎంపికచేసింది. 
 
ఈ పరీక్ష ఫలితాలను అభ్యర్థులు తమ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని యూపీఎస్సీ వెల్లడించింది. ఈ ఫలితాల్లో అనుదీప్‌తో పాటు 43వ ర్యాంకులో శీలం సాయి, వందో ర్యాంకులో నారపురెడ్డి మౌర్య, 195 ర్యాంకులో వివేక్‌ జాన్సన్‌, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుమారుడు సాయి ప్రణీత్ 196వ ర్యాంకు సాధించాడు. ఇక జి. మాధురి - 144, యెడవల్లి అక్షయ్‌ కుమార్‌- 624, భార్గవ శేఖర్‌ - 816 ర్యాంకులు సాధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాడిపత్రిలో వైకాపా నేత ఆర్సీ ఓబుల్ రెడ్డిపై దాడి - ఉద్రిక్తత

వరకట్నం వేధింపులు.. భర్త ఇంట్లో లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్య

టిక్ టాక్ వీడియోలు పోస్ట్ చేసిన యువతిని కాల్చి చంపేశారు... ఎక్కడ?

High alert: ఎర్రకోట సమీపంలో పేలుడు.. పది మంది మృతి.. హైదరాబాదులో అలెర్ట్

APCRDA: నవంబర్ 14-15 తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సమ్మిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

తర్వాతి కథనం
Show comments