Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారకరత్న వైద్యం కోసం బెంగుళూరుకు విదేశాల నుంచి వైద్యులు

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (10:10 IST)
ఇటీవల చిత్తూరు జిల్లా కుప్పంలో తీవ్ర అనారోగ్యానికిగురై బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో తారకరత్నకు వైద్యం చేయించేందుకు విదేశాల నుంచి వైద్యులను రప్పించారు. జనవరి నెలాఖరు నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు వైద్యం చేయించేందుకు విదేశాల నుంచి వైద్యులను రప్పించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. విదేశీ వైద్యులను రప్పించి చికిత్స అందిస్తున్నట్టు వారు వెల్లడించారు. హృద్రోగంతోపాటు నాడీ సమస్యలకు వారు చికిత్స చేస్తున్నట్టు తెలిపారు.
 
కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గత నెల 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. ఇందులో పాల్గొనేందుకు కుప్పం వెళ్లిన తారకరత్నకు గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఆయనకు తొలుత కుప్పం ఆస్పత్రిలోనూ ప్రాథమిక వైద్యం అందించి ఆ తర్వాత బెంగుళూరుకు తరలించారు. 
 
గత 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా విదేశాల నుంచి వైద్యులను రప్పించినట్టు తారకరత్న కుటుంబ సభ్యులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments