Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారకరత్న వైద్యం కోసం బెంగుళూరుకు విదేశాల నుంచి వైద్యులు

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (10:10 IST)
ఇటీవల చిత్తూరు జిల్లా కుప్పంలో తీవ్ర అనారోగ్యానికిగురై బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో తారకరత్నకు వైద్యం చేయించేందుకు విదేశాల నుంచి వైద్యులను రప్పించారు. జనవరి నెలాఖరు నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు వైద్యం చేయించేందుకు విదేశాల నుంచి వైద్యులను రప్పించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. విదేశీ వైద్యులను రప్పించి చికిత్స అందిస్తున్నట్టు వారు వెల్లడించారు. హృద్రోగంతోపాటు నాడీ సమస్యలకు వారు చికిత్స చేస్తున్నట్టు తెలిపారు.
 
కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గత నెల 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. ఇందులో పాల్గొనేందుకు కుప్పం వెళ్లిన తారకరత్నకు గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఆయనకు తొలుత కుప్పం ఆస్పత్రిలోనూ ప్రాథమిక వైద్యం అందించి ఆ తర్వాత బెంగుళూరుకు తరలించారు. 
 
గత 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా విదేశాల నుంచి వైద్యులను రప్పించినట్టు తారకరత్న కుటుంబ సభ్యులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments