Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో డబ్బుల్లేవ్.. సీరియళ్లలో నటించే అన్నాచెల్లెలు ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (09:56 IST)
కరోనా మహమ్మారి సోకి వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా.. కోవిడ్ కారణంగా లాక్ డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. ఇక దేశ వ్యాప్తంగా కూడా ముంబై, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో టీవీ నటులు షూటింగులు లేక, చేతిలో డబ్బుల్లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. 
 
ఇలానే గత మూడు నెలల నుంచి షూటింగ్స్ లేకపోవడంతో.. ఆర్థిక ఇబ్బందులతో సీరియళ్లలో నటించే అన్నాచెల్లెలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలోని కొడంగయ్యూర్‌లో జరిగింది. టీవీ సీరియల్స్‌లో నటించే అన్నాచెల్లెళ్లు, శ్రీధర్, జయ కళ్యాణి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారు నివసిస్తున్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు వచ్చి డోర్ పగలగొట్టి చూడగా.. అన్నాచెల్లెళ్ల మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. వీరు ఆత్మహత్య చేసుకొని కొన్ని రోజులు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments