Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో డబ్బుల్లేవ్.. సీరియళ్లలో నటించే అన్నాచెల్లెలు ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (09:56 IST)
కరోనా మహమ్మారి సోకి వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా.. కోవిడ్ కారణంగా లాక్ డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. ఇక దేశ వ్యాప్తంగా కూడా ముంబై, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో టీవీ నటులు షూటింగులు లేక, చేతిలో డబ్బుల్లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. 
 
ఇలానే గత మూడు నెలల నుంచి షూటింగ్స్ లేకపోవడంతో.. ఆర్థిక ఇబ్బందులతో సీరియళ్లలో నటించే అన్నాచెల్లెలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలోని కొడంగయ్యూర్‌లో జరిగింది. టీవీ సీరియల్స్‌లో నటించే అన్నాచెల్లెళ్లు, శ్రీధర్, జయ కళ్యాణి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారు నివసిస్తున్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు వచ్చి డోర్ పగలగొట్టి చూడగా.. అన్నాచెల్లెళ్ల మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. వీరు ఆత్మహత్య చేసుకొని కొన్ని రోజులు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Xi Mingze: అమెరికాలో చైనా అధ్యక్షుడి కుమార్తె జి మింగ్జే.. బహిష్కరించండన్న ట్రంప్ ఫ్రెండ్

మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య

Visakhapatnam: విశాఖపట్నంలో మెట్రో రైలు సేవలు... ప్రారంభానికి ఏపీ సన్నాహాలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments