Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరి దశకు చేరుకున్న సైరా షూటింగ్.. అక్టోబర్ 2న విడుదల

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (19:01 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. 
 
మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. స్వాతంత్ర్య సమర నేపథ్యానికి సంబంధించిన సినిమా కావడంతో ఈ సినిమాను కూడా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేయాలని ముందుగా చిత్ర యూనిట్ భావించింది. 
 
అయితే సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడంతో అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి నాడు విడుదల చేయాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. 
 
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని అక్టోబర్ 2న విడుదల చేయడాన్ని దర్శక నిర్మాతలు దాదాపు ఖరారు చేశారట. నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, అమితాబ్ బచ్చన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

Air India: అహ్మదాబాద్-లండన్ విమానం రద్దు.. ఏమైందంటే?

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments