Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేనాటి వీరుడి కథ "సైరా".. దుమ్మురేపుతున్న మెగాస్టార్

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (08:26 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. రేనాటి వీరుడి జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ యువ హీరో రాం చరణ్ నిర్మించగా, ఇందులో అమితాబ్, నయనతార, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుధీప్ వంటి భారీ తారాగణం నటించింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో అక్టోబరు రెండో తేదీన విడుదలకానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. 
 
ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్‌తో ఈ సినిమా నుంచి ఒక టీజర్‌ను రిలీజ్ చేయగా, దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. 'రేనాటి వీరులారా చరిత్రలో మనం ఉండకపోవచ్చు. కానీ చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి' అంటూ చిరూ చెప్పిన డైలాగ్ టీజర్లో హైలైట్ అయింది.
 
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. ఆంగ్లేయులపై నరసింహారెడ్డి తిరుగుబాటు.. నరసింహారెడ్డి ఆచూకీ కోసం ఆంగ్లేయులు అక్కడి ప్రజలను హింసించడం ఈ ట్రైలరులో చూపించారు. 
 
'స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తోన్న తిరుగుబాటు.. నా భరతమాత గడ్డమీద నిలబడి హెచ్చరిస్తున్నా.. నా దేశం వదిలి వెళ్లిపోండి.. లేదా.. యుద్ధమే' అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్‌కి హైలైట్‌గా నిలిచింది. ఈ ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాఫీ బాగోలేదన్నందుకు హత్య చేసారా? కొత్తజంట హనీమూన్ మిస్సింగ్ మిస్టరీ

రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వెళ్లిన జగన్... ప్రజా సంఘాల నిరసన

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments