Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ మృతికి సోదరీమణులు ఇచ్చిన మందులే కారణమా?

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (08:51 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో సరికొత్త సందేహం ఇపుడు తెరపైకి వచ్చింది. ఆయన ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో మానసిక ఒత్తిడితో బాధపడుతూ వచ్చిన సుశాంత్‌కు ఆయన సోదరీమణులు ప్రియాంకా సింగ్, మీతూ సింగ్‌లు కొన్ని రకాల మందులు ఇచ్చారు. వీటి కారణంగా కూడా సుశాంత్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న సందేహం ఇపుడు తెరపైకి వచ్చింది. 
 
ఈ ఆరోపణతో ఫిర్యాదు చేసిన సుశాంత్‌ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి.. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలను సమర్పించిందని, ఆ మేరకే తాము కేసు నమోదు చేశామని బాంబే హైకోర్టుకు తెలిపారు. సుశాంత్‌ సోదరీమణులు ప్రియాంకా సింగ్‌, మీతూ సింగ్‌లపై కేసు పెట్టడాన్ని సీబీఐ తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ అఫిడవిట్‌ దాఖలు చేశారు. 
 
కాగా, సుశాంత్‌ మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకంటూ ప్రియాంక, మీతూసింగ్‌ వాట్సాప్‌ ద్వారా 3 రకాల మందుల పేర్లను పంపారని, అయితే వైద్యుడు పరీక్షించకుండానే ఇచ్చిన ఆ మందులు ఆయనను ఆత్మహత్యకు పురిగొల్పేలా ప్రభావం చూపి ఉంటాయని రియా చక్రవర్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా, సుశాంత్‌కు, ఆయన సోదరీమణులకు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలను కోర్టుకు సమర్పించి.. వారిపై నమోదైన కేసును కొట్టివేయొద్దంటూ కోర్టును రియా చక్రవర్తి తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments