Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సర్జరీలే శ్రీదేవిని బలి తీసుకున్నాయా? ఆరు నెలల్లో 20 సర్జరీలు?

సినీ తారలు అందానికి ప్రాధాన్యత ఇస్తారు. అందం వున్నంతవరకే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనే లాజిక్ వారికి బాగా తెలుసు కాబట్టి.. హీరోయిన్లు ఫిట్‌గా కనిపించడంతో పాటు తమ శరీరాకృతికి వన్నె తగ్గకుండా చూసేందుకు

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (12:23 IST)
సినీ తారలు అందానికి ప్రాధాన్యత ఇస్తారు. అందం వున్నంతవరకే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనే లాజిక్ వారికి బాగా తెలుసు కాబట్టి.. హీరోయిన్లు ఫిట్‌గా కనిపించడంతో పాటు తమ శరీరాకృతికి వన్నె తగ్గకుండా చూసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటారు. లావు పెరిగితే తగ్గించుకునేందుకు కూడా ఆపరేషన్లు చేసుకుంటారు. 
 
అయితే గతంలో లావుగా వున్న హీరోయిన్లు విదేశాల్లో శస్త్రచికిత్స చేసుకున్న దాఖలాలున్నాయి. కానీ ఈ ఆపరేషన్లు వికటించిన మరణాలకు దారితీసిన దాఖలాలూ వున్నాయి. ఇందుకు ఆర్తీ అగర్వాల్ మృతి కూడా ఓ ఉదాహరణ. పెళ్లైయ్యాక లావైన ఆర్తీ అగర్వాల్.. సినిమాల్లో నటించేందుకు లావు తగ్గాలని అమెరికాలో చికిత్స చేయించుకుంది. 
 
కానీ ఆ ఆపరేషన్ కాస్త వికటించి ప్రాణాలు కోల్పోయింది. ఇదే తరహాలో ఉన్నట్టుండి కార్డియా అటాక్‌తో ప్రాణాలు కోల్పోయిన శ్రీదేవి మరణానికి కూడా సర్జరీలే కారణమని నెట్టింట చర్చ జరుగుతోంది. శ్రీదేవి గతంలో పెదవులు, బ్రెస్ట్, ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని.. ఇటీవల ఆరు నెలల్లో 20 సర్జరీలు శ్రీదేవి చేయించుకున్నట్లు సమాచారం. ఈ సర్జరీల ఎఫెక్టే ఆమె హృదయంపై భారం మోపాయని వైద్యులు చెప్తున్నారు. 
 
ఇంకా సెలెబ్రిటీలు కెరీర్, ఆర్థికపరమైన ఒత్తిళ్లకు గురవుతుంటారు. ఈ ఒత్తిడి గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలా ఒత్తిడికి గురైనప్పుడు గుండె వేగం 120 నుంచి 150 సార్లకు పైగా కొట్టుకుంటుంది. గుండె నుంచి ఇతర శరీర భాగాలకు రక్త ప్రసరణ వేగంగా సాగాల్సిన సమయంలో రక్త నాళాలు చిన్నవిగా కుంచించుకుపోతాయి. 
 
అప్పటివరకు రక్తనాళాల్లో బ్లాకులు లేకపోయినప్పటికీ ఒత్తిడి వల్ల అవి కుంచించుకుపోయి సడన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌కు కారణమవుతాయని వైద్యులు చెప్తున్నారు. ఒత్తిడి వల్లే శ్రీదేవి కూడా ప్రాణాలు కోల్పోయిందని.. తన కుమార్తె తొలి సినిమా గురించి ఆమె ఎక్కువగా ఆలోచించేదని సన్నిహిత వర్గాల సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments