Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వార్త విని నా గుండె పగిలిపోయింది.. సురేఖా వాణి

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (14:43 IST)
టాలీవుడ్ క్యూట్ కపుల్స్ నాగ చైతన్య - సమంతలు తమ వైవాహిక బంధాన్ని తెంచుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. దీనిపై అనేక మంది సినీ సెలెబ్రిటీలు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదే పోస్ట్ పంచుకున్న సినీ నటి సురేఖా వాణి.. నాగ చైతన్య- సమంత విడిపోతున్నారనే వార్త తెలిసి గుండె పగిలిందంటూ ఎమోషనల్ అయ్యారు. ఇలా జరగకుండా ఉండాల్సింది అని బాధాత‌ప్త హృద‌యంతో పేర్కొంది.
 
కాగా, 'ఏ మాయ చేశావే' సినిమా షూటింగ్ సమయంలో వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌ చిగురించ‌గా, దాదాపు ఏడేళ్లపాటు కొనసాగింది. చివరకు ఇరు కుటుంబాల అంగీకారంతో 2017లో ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. 
 
అక్టోబ‌ర్ 6,7 తేదీల‌లో హిందూ, క్రిస్టియ‌న్ సంప్ర‌దాయాల ప్ర‌కారం వీరి వివాహం జ‌ర‌గ‌గా, అప్ప‌ట్లో వీరి పెళ్లి ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వీరిద్ద‌రు ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలుస్తారు అనుకున్న స‌మ‌యంలో అక్టోబ‌ర్ 2 మ‌ధ్యాహ్నం తాము విడాకులు తీసుకోబోతున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రికి షాక్ ఇచ్చారు.
 
దీనిపై నాగార్జున కూడా రియాక్ట్ అవుతూ.. 'బరువెక్కిన గుండెతో ఈ విషయం మీతో చెబుతున్నా. ఇలా జరగడం చాలా దురదృష్టకరం. భార్యభర్తలైన చై- సామ్ మధ్య జరిగింది పర్సనల్. ఆ ఇద్దరూ నాకు ఎంతో ప్రియమైన వారు. నేను, నా ఫ్యామిలీతో కలిసి సమంతతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వారిద్దరికి బలం చేకూర్చాలని ఆ దేవుడిని కోరుతున్నాను' అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments