Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వార్త విని నా గుండె పగిలిపోయింది.. సురేఖా వాణి

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (14:43 IST)
టాలీవుడ్ క్యూట్ కపుల్స్ నాగ చైతన్య - సమంతలు తమ వైవాహిక బంధాన్ని తెంచుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. దీనిపై అనేక మంది సినీ సెలెబ్రిటీలు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదే పోస్ట్ పంచుకున్న సినీ నటి సురేఖా వాణి.. నాగ చైతన్య- సమంత విడిపోతున్నారనే వార్త తెలిసి గుండె పగిలిందంటూ ఎమోషనల్ అయ్యారు. ఇలా జరగకుండా ఉండాల్సింది అని బాధాత‌ప్త హృద‌యంతో పేర్కొంది.
 
కాగా, 'ఏ మాయ చేశావే' సినిమా షూటింగ్ సమయంలో వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌ చిగురించ‌గా, దాదాపు ఏడేళ్లపాటు కొనసాగింది. చివరకు ఇరు కుటుంబాల అంగీకారంతో 2017లో ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. 
 
అక్టోబ‌ర్ 6,7 తేదీల‌లో హిందూ, క్రిస్టియ‌న్ సంప్ర‌దాయాల ప్ర‌కారం వీరి వివాహం జ‌ర‌గ‌గా, అప్ప‌ట్లో వీరి పెళ్లి ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వీరిద్ద‌రు ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలుస్తారు అనుకున్న స‌మ‌యంలో అక్టోబ‌ర్ 2 మ‌ధ్యాహ్నం తాము విడాకులు తీసుకోబోతున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రికి షాక్ ఇచ్చారు.
 
దీనిపై నాగార్జున కూడా రియాక్ట్ అవుతూ.. 'బరువెక్కిన గుండెతో ఈ విషయం మీతో చెబుతున్నా. ఇలా జరగడం చాలా దురదృష్టకరం. భార్యభర్తలైన చై- సామ్ మధ్య జరిగింది పర్సనల్. ఆ ఇద్దరూ నాకు ఎంతో ప్రియమైన వారు. నేను, నా ఫ్యామిలీతో కలిసి సమంతతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వారిద్దరికి బలం చేకూర్చాలని ఆ దేవుడిని కోరుతున్నాను' అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తొక్కలో ముష్టి ఫర్నీచర్ ఎంతో చెప్పండి, జగన్ వెంట్రుక కూడా పీకలేరు: కొడాలి నాని

లిక్కర్ కేసు.. అరవింద్ కేజ్రీవాల్ అవుట్.. కవిత సంగతేంటి?

వందేభారత్ రైలు భోజనంలో బొద్దింక- సారీ చెప్పిన ఐఆర్‌సీటీసీ

ఈవీఎంలను సరిచూడండి.. వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన వైకాపా

ఆంధ్రప్రదేశ్: పల్నాడులోని కొన్ని గ్రామాల్లో జనం ఇళ్ళు వదిలి ఎందుకు వెళ్లిపోతున్నారు-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

లవంగం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments