Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోసం చేసిన వారు ఎప్పుడూ బాగుపడరు... సిద్ధార్థ్

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (13:16 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన క్యూట్ కపుల్ నాగ చైతన్య, సమంతలు తమ వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాఫ్ పెడుతున్నట్టు శనివారం అధికారికంగా ప్రకటించారు. దీనిపై టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ ఓ ట్వీట్ చేశారు. ఇది ఇపుడు వైరల్ అవుతోంది. స‌మంత పేరును ప్ర‌స్తావించ‌కుండా ఆయ‌న ఈ ట్వీట్ చేశాడు. 'పాఠ‌శాల‌లో మా టీచర్ నేర్పిన తొలిపాఠం ఇది.. మోసం చేసేవారు ఎప్పుడూ బాగుపడరు' అని సిద్థార్థ్ అన్నాడు.
 
నాగ‌ చైత‌న్య‌, స‌మంత పెళ్లి చేసుకోక‌ముందు రోజుల‌ను గుర్తు చేసుకుంటూ సిద్ధార్థ్ ఇలాంటి వ్యాఖ్య చేశార‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మ‌ళ్లీ స‌మంత‌, సిద్ధార్థ్ క‌ల‌వాలంటూ ఒక‌రు కామెంట్ చేశారు. నాగ‌ చైత‌న్య, సమంత విడిపోతే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తావా? అంటూ మ‌రికొంద‌రు చివాట్లు పెడుతున్నారు. అప్ప‌ట్లో సిద్ధార్థ్‌, స‌మంత క‌లిసి తిరిగిన రోజుల‌ను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. 
 
కాగా, స‌మంత కూడా నిన్న 'కొన్నిసార్లు వాళ్లే గెలవొచ్చు... కానీ చివరికి వాళ్లే పతనమవుతారు. దీన్ని నేనెప్పుడూ నమ్ముతుంటాను' అంటూ ఓ పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఆమె ఎవ‌రిని ఉద్దేశించి పోస్ట్ చేసిందో కూడా తెలియ‌క నెటిజ‌న్లు తిక‌మ‌కప‌డుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments